
పోషణ్ ట్రాకర్
అంగన్వాడీల్లో లబ్ధిదారుల వివరాల నమోదు
భార్యాభర్తల్లో ఎవరైనా..
గర్భిణులు, బాలింతలు లేదా వారి భర్తలు ఎవరైనా ఒకరు వచ్చి పోషణ్ ట్రాకర్ యాప్లో వివరాలు నమోదు చేసుకుంటేనే సరుకులు అందిస్తున్నారు. ముఖాలను యాప్ ధ్రువీకరించకపోతే సరుకులు అందించే వీలు లేదు.
మొరాయిస్తున్న నెట్వర్క్..
పోషణ్ ట్రాకర్ యాప్లో వివరాల నమోదు సమయంలో సెల్ఫోన్ సిగ్నల్స్ లేకపోవడం, సర్వర్ స్లో, సర్వర్ ప్రాబ్లం తలెత్తడంతో టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రతిరోజు కనీసం అయిదుగురికి కూడా సరుకులు పంపిణీ చేయలేకపోతున్నామని టీచర్లు వాపోతున్నారు. అధికారులు స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
అమరచింత: అంగన్వాడీ కేంద్రాల్లో పారదర్శకత కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గర్భిణులు, బాలింతలు, కిషోర బాలికలు, చిన్నారులకు అందించే పౌష్టికాహరం పక్కదారి పట్టకుండా పోషన్ ట్రాకర్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. యాప్లో లబ్ధిదారు ఆధార్ నంబర్, ఫొటో, సెల్నంబర్ నమోదు కొనసాగుతుంది. లబ్ధిదారు సెల్ఫోన్కు వచ్చిన ఓటీపీని నమోదు చేసిన అనంతరం సరుకులు పంపిణీ చేయనున్నారు. దీంతో సరుకులు నేరుగా లబ్ధిదారుకే అందనున్నాయి.
పక్కదారి పట్టకుండా..
లబ్ధిదారులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా రోజు బియ్యం, పప్పు, నూనె, ఆకుకూరలు, గుడ్లు, బాలామృతం తదితర సరుకులు అందిస్తున్నారు. ఆయా సరుకులు పక్కదారి పడుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం కట్టడికి చర్యలు చేపట్టింది. యాప్లో లబ్ధిదారు ఫొటోతీసి అప్లోడ్ చేయడంతో అర్హులకే లబ్ధి చేకూరుతుంది. దీంతో అక్రమాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది.
సరుకుల పంపిణీలో
అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకే
మెరుగైన సేవలకు ప్రభుత్వం నిర్ణయం

పోషణ్ ట్రాకర్