
కాల్వకు గండి.. పట్టించుకోని అధికారులు
పాన్గల్: మండలంలోని మాందాపూర్–రాయినిపల్లి గ్రామాల మధ్య ఉన్న కేఎల్ఐ మైనర్ కాల్వకు గండిపడి సాగునీరు వృథా అవుతోంది. కాల్వలపై నీటిపారుదలశాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కోతకు గురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాల్వకు గండి పడి రెండు, మూడురోజులు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని.. చివరి ఆయకట్టుకు సక్రమంగా నీరందక పంటలు ఎండుతున్నాయని వివరించారు. ఇప్పటికై నా స్పందించి కాల్వలపై పర్యవేక్షణ పెంచి చివరి ఆయకట్టుకు సక్రమంగా సాగునీరు చేరేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
రంగనాథుడి సన్నిధిలో పాలమూరు న్యాయమూర్తి
వనపర్తి రూరల్: శ్రీరంగాపురం రంగనాథస్వామి ఆలయాన్ని శనివారం మహబూబ్నగర్ సీనియర్ సివిల్ నాయమూర్తి రాధిక కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ విశిష్టతను వివరించి స్వామివారి శేషవస్త్రాలతో సత్కరించి వేద ఆశీర్వచం చేశారు. కార్యక్రమంలో ఎస్ఐ రామకృష్ణ, ఆలయ సిబ్భంది తదితరులు పాల్గొన్నారు.
‘సుంకాల భారం సరికాదు’
వనపర్తి రూరల్: భారతదేశ ఉత్పత్తులపై అమెరికా విఽధిస్తున్న అధిక సుంకాలు సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాలనర్సింహ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రధాని మోదీ గొప్ప నాయకుడని చెబుతున్నారని.. అధిక సుంకాలను ఆపమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను అడిగే ధైర్యం ఎందుకు లేదని ప్రశ్నించారు. 50 లక్షల డాలర్ల గోల్డ్కార్డు కొంటేనే అమెరికాలో శాశ్వతంగా ఉండొచ్చని చెబుతున్నారని.. ఇది భారతీయులకు ఎంతో భారమన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు పూర్తిగా అమలు చేయడం లేదని.. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, రూ.500కి సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పాక్షికంగానే అమలవుతున్నాయని వివరించారు. ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంటే మిత్రపక్షమైన సీపీఐ ఎంతో కాలం చూస్తూ ఊరుకోలేదన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి విజయరాములు, కళావతమ్మ, శ్రీరాం, మోషా, రమేష్ అబ్రహం, గోపాలకృష్ణ, రవీందర్, శ్రీహరి, నరసింహశెట్టి తదితరులు పాల్గొన్నారు.

కాల్వకు గండి.. పట్టించుకోని అధికారులు

కాల్వకు గండి.. పట్టించుకోని అధికారులు