
శ్రీరామనవమికి ఆలయాలు ముస్తాబు
వనపర్తి టౌన్: శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం సీతారాముల కల్యాణ వేడుకను కనులపండువగా నిర్వహించేందుకు జిల్లాలోని ఆలయాలు, మండపాలు ముస్తాబయ్యాయి. జిల్లాకేంద్రంలోని రామాలయం, వేంకటేశ్వరస్వామి, లక్ష్మీ నర్సింహస్వామి, గోపాల్పేట రోడ్లోని రామాంజనేయ, రాంనగర్లోని రామాంజనేయ ఆలయాల్లో కల్యాణ క్రతువు నిర్వహించనున్నారు. రామాలయంలో ఆలయ ప్రధాన అర్చకుడు నరేంద్రస్వామి నేతృత్వంలో యాగశాలను ఏర్పాటుచేసి మూడురోజులుగా వేద పండితులు పూజాదికాలు నిర్వహిస్తున్నారు. శనివారం సుదర్శన హోమం.. రాత్రి సీతారాముల ఎదుర్కోళ్ల మహోత్సవం భక్తిశ్రద్ధలతో చేపట్టారు. ఆదివారం కల్యాణ వేడుకకు హాజరయ్యే భక్తుల కోసం వేసవి దృష్ట్యా చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. కల్యాణ మండపాన్ని రంగురంగు పూలు, మామిడి తోరణలతో అందంగా అలంకరించారు. కల్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు పలు ఆలయాల్లో ప్రొజెక్టర్లు ఏర్పాటు చేయడంతో పాటు పలు ఆలయాలను రంగురంగుల విద్యుద్ధీపాలతో అలంకరించారు.
ఆర్టీసీకి 300 ఆర్డర్లు..
భద్రాద్రి రామయ్య కల్యాణ తలంబ్రాలను ఆర్టీసీ కార్గో ద్వారా పొందేందుకు శనివారం వరకు జిల్లా లో 300 మంది భక్తులు రూ.45,300 చెల్లించినట్లు వనపర్తి ఆర్టీసీ డిపో మేనేజర్ వేణుగోపాల్ తెలి పారు. రూ.151 చెల్లించి ఈ నెల 7 వరకు బుక్ చేసు కునే అవకాశం ఉందని.. ఈ నెల 15 వరకు భక్తుల చెంతకు చేరుస్తామని వివరించారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
నేడు సీతారాముల కల్యాణ వేడుక
ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు