డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క బుధవారం అసెంబ్లీలో అన్నివర్గాలకు మేలు చేకూర్చే బడ్జెట్ను ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో 90 శాతం ప్రజల జీవనాధారమైన వ్యవసాయానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేసింది. సాగునీటి రంగానికి సైతం తగిన ప్రాధాన్యతనిచ్చి నిధుల కేటాయింపులు చేశాం. పదేళ్లుగా నిర్వీర్యమైన కార్పొరేషన్లకు నిధులు కేటాయించి పునరుజ్జీవం వచ్చేలా పద్దులు ఉన్నాయి.
– తూడి మేఘారెడ్డి, ఎమ్మెల్యే, వనపర్తి
బడ్జెట్లో వెనుకబడిన పాలమూరుకు ప్రత్యేకంగా చేసిన కేటాయింపులు ఏమీ లేవు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు ఇప్పటికీ మోక్షం లభించలేదు. 15 నెలల పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది. రైతుభరోసాకు రైతులు ఎదురుచూసే దుస్థితి నెలకొంది. రుణమాఫీ అరకొరగా చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుంది. అంకెల గారడీతో రూ.మూడు లక్షల కోట్ల బడ్జెట్ అని గొప్పలు చెప్పుకోవడమే సరిపోయింది. – నారాయణ,
బీజేపీ జిల్లా అధ్యక్షుడు, వనపర్తి
ప్రత్యేక కేటాయింపులేవీ?
ప్రజామోద బడ్జెట్..