
మానవ అక్రమ రవాణా.. పెను సమస్య
జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుభద్ర
బీచ్రోడ్డు: మానవ అక్రమ రవాణా ప్రపంచవ్యాప్తంగా పెను సమస్యగా మారుతోందని, ఇది చాలా విచారకరమని ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె. సుభద్ర అన్నారు. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ చైల్డ్ రైట్స్ అవేర్నెస్ ఫోరం, ఏటీఎస్ఏసీ ఇండియా సంస్థ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, హెల్ప్ స్వచ్ఛంద సంస్థ, సీఐడీ, పలు సంస్థల సమన్వయంతో రూపొందించిన ‘మానవ అక్రమ రవాణా ఒక వ్యవస్థీకృత నేరం – ఈ దోపిడీని అంతం చేయండి’ పోస్టర్ను మంగళవారం సిరిపురంలోని జెడ్పీ చైర్మన్ క్యాంప్ ఆఫీసులో ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధానంగా అక్రమ రవాణాలో పిల్లలు, మహిళలు, పేదలు, నిరక్షరాస్యులు బాధితులుగా మారుతుండటం బాధాకరమన్నారు. చెల్డ్ రైట్స్ అవేర్నెస్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ గొండు సీతారాం మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాతో పాటు బాలికల అక్రమ రవాణా వ్యవస్థను రూపుమాపేందుకు తమ ఫోరం రాష్ట్రంలోని 16 ఎన్జీవోలతో కలిసి పనిచేస్తోందన్నారు.ఫోరం ప్రతినిధులు కె. ఎల్లయ్య, బి. లవకుశ, ఎం. ప్రవీణా త్రినాథ్, బి. లక్ష్మణరావు, బొడ్డేపల్లి సురేష్, ఎం. హరీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.