70 కేసుల్లో 65 మంది అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

70 కేసుల్లో 65 మంది అరెస్ట్‌

Jun 27 2025 4:07 AM | Updated on Jun 27 2025 4:07 AM

70 కే

70 కేసుల్లో 65 మంది అరెస్ట్‌

రూ.1.04 కోట్ల చోరీ సొత్తు స్వాధీనం

విశాఖ సిటీ: నగరంలో నేర నియంత్రణకు చేపడుతున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చి అన్నారు. పోలీస్‌ సమావేశ మందిరంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో మే నెలలో 82 చోరీ కేసు లు నమోదైనట్లు చెప్పారు. వాటిలో 70 కేసులను ఛేదించి 65 మంది నిందితులను అరెస్ట్‌ చేసినట్లు వెల్లడించారు. వారి నుంచి రూ.1,04,97,450 చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇందులో 1.04 కిలోల బంగారం, 6.06 కిలోల వెండి, రూ.9,09,900 నగదు, 14 ద్విచక్ర వాహనాలు, 392 మొబైల్‌ ఫోన్లు, పొక్లెయినర్‌, కారు, ల్యాప్‌టాప్‌, ఇతర వస్తువులను రికవరీ చేసినట్లు వివరించారు. నగరంలో నేర నియంత్రణకు, నిందితులను గుర్తించేందుకు వీలుగా మేలో 610 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. అలాగే సీసీ కెమెరాల ఏర్పాటుపై ఎప్పటికప్పుడు ప్రజలు, వ్యాపారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. నేరాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో పగలు, రాత్రుళ్లు ప్రత్యేక బృందాలతో పాటు డ్రోన్ల ద్వారా కూడా నిఘా పెట్టినట్లు చెప్పా రు. అనంతరం రికవరీ చేసిన సొత్తును బాధితులకు అందజేశారు. సమావేశంలో డీసీపీ(క్రైం) లతా మాధురి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

70 కేసుల్లో 65 మంది అరెస్ట్‌1
1/2

70 కేసుల్లో 65 మంది అరెస్ట్‌

70 కేసుల్లో 65 మంది అరెస్ట్‌2
2/2

70 కేసుల్లో 65 మంది అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement