
వీటిని రోడ్లంటారా?
స్మార్ట్ సిటీలోని వీధుల్లో రహదారులు ప్రయాణికులకు నరకాన్ని చూపిస్తున్నాయి. ఎక్కడికక్కడ తవ్వకాలు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ రోడ్లపై ప్రయాణించడమంటే ప్రాణాలతో చెలగాటమాడటమేనని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాహనాలపైనే
కాదు కనీసం కాలి నడకన వెళ్లేందుకు కూడా వీల్లేకుండా కొన్ని చోట్ల రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. కొద్ది రోజులుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, 24/7 మంచినీటి సరఫరా, ఇతర అభివృద్ధి పనుల పేరుతో వీధుల్లో రహదారులను విచక్షణారహితంగా తవ్వేస్తున్నారు. పనులు పూర్తయిన తర్వాత ఆ గోతులను పటిష్టంగా పూడ్చకుండా నామమాత్రంగా మట్టి, కంకర వేసి వదిలేస్తున్నారు. దీనికి తోడు ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఆ ప్రాంతాలన్నీ ప్రమాదకరంగా మారాయి. వర్షం నీటితో గోతులు నిండిపోయి, ఏది రోడ్డో.. ఏది గొయ్యో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ద్విచక్ర వాహనదారులు తరచూ అదుపుతప్పి కిందపడుతూ గాయాలపాలవుతున్నారు. కొన్ని చోట్ల మ్యాన్హోల్స్ రోడ్డు కంటే ఎత్తుగా ఉండటం, మరికొన్ని చోట్ల లోపలికి కుంగిపోవడం వాహనదారులకు ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా కేఆర్ఎం కాలనీ, సీతమ్మధార, కృష్ణా కాలేజ్, ఎంవీపీ సెక్టార్–9 ఫిషర్మెన్ కాలనీ, శివాజీపాలెం తదితర ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ సమస్యపై నగరవాసులు జీవీఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం ఉండటం లేదు. వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం కూడా ఈ దుస్థితికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ప్రమాదం జరిగాక స్పందించడం కంటే.. ముందుగానే తగిన చర్యలు చేపట్టాలని నగరవాసులు కోరుతున్నారు.
– ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం
శివాజీపాలెంలో
పైకి వచ్చిన మ్యాన్హోల్
ఫిషర్మెన్ కాలనీలో రోడ్ల దుస్థితి ఇది

వీటిని రోడ్లంటారా?

వీటిని రోడ్లంటారా?

వీటిని రోడ్లంటారా?

వీటిని రోడ్లంటారా?

వీటిని రోడ్లంటారా?

వీటిని రోడ్లంటారా?