
లిక్విడ్ గంజాయి పట్టివేత
పెందుర్తి: అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతం నుంచి విశాఖ నగరానికి తరలిస్తున్న 1.6 కిలోల లిక్విడ్ గంజాయిని టాస్క్ఫోర్స్, పెందుర్తి పోలీసులు పట్టుకున్నారు. సీఐ కె.వి.సతీష్కుమార్ తెలిపిన వివరా లివి. పెదబయలుకు చెందిన గుళ్లేలి చిన్నంనాయు డు, పురుష్కారి సోమేష్, గెమ్మిలి ప్రసాదరావు, అర్బాబు మత్స్యలింగం కలిసి నగరానికి లిక్విడ్ గంజాయిని తరలిస్తున్నట్లు టాస్క్ఫోర్స్ పోలీసులు సమాచారం అందుకున్నారు. సరిపల్లి వద్ద కాపుకాసి వారిని పట్టుకుని పెందుర్తి పోలీసులకు అప్పగించారు. కేసు దర్యాప్తు జరుగుతోంది.