1,400 కొత్త బస్సులు వచ్చాయి.. | - | Sakshi
Sakshi News home page

1,400 కొత్త బస్సులు వచ్చాయి..

Jun 20 2025 5:20 AM | Updated on Jun 20 2025 5:20 AM

1,400 కొత్త బస్సులు వచ్చాయి..

1,400 కొత్త బస్సులు వచ్చాయి..

మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి

ద్వారకా బస్‌ స్టేషన్‌లో

సీసీ కెమెరాలు ప్రారంభం

డాబాగార్డెన్స్‌ : రాష్ట్రంలో 1400 కొత్త బస్సులు అందుబాటులోకి తెచ్చామని, త్వరలో మరికొన్ని ఎలక్ట్రికల్‌ బస్సులతో పాటు డీజిల్‌ బస్సులు కూడా వస్తాయని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. ద్వారకా బస్‌ స్టేషన్‌ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను గురువారం మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ విశాఖకు కేటాయించిన 100 ఎలక్ట్రికల్‌ బస్సుల్లో 50 బస్సులు సింహపురి కాలనీ డిపో, 50 బస్సులు గాజువాక డిపోకి అందించామన్నారు. విశాఖకు మరిన్ని బస్సులు పెంచి, ప్రయాణికుల అవసరాలు తీర్చేలా చర్యలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. సీఎంఆర్‌, స్టాల్స్‌ అసోసియేషన్‌ సౌజన్యంతో ద్వారకా బస్‌ స్టేషన్‌ కాంప్లెక్స్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో విజయనగరం జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కేఎస్‌ బ్రహ్మానందరెడ్డి, ప్రాంతీయ మేనేజర్‌ బి.అప్పలనాయుడు, డిప్యూటీ చీఫ్‌ పర్సనల్‌ మేనేజర్‌ ఎం.సుధాబిందు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement