
ఆధ్యాత్మిక యోగం
సింహగిరిపై 500 మందితో యోగాసనాలు
సింహాచలం: సింహగిరిపై బుధవారం 500 మందితో యోగాభ్యాసం నిర్వహించారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని బీచ్రోడ్డులో జరిగే కార్యక్రమంలో పాల్గొనే దేవస్థానం ఉద్యోగులు, వైదికులు, సంస్కృతోన్నత పాఠశాల, వేద పాఠశాల విద్యార్థులకు అనుభవజ్ఞుల పర్యవేక్షణలో యోగాసనాలు నేర్పించారు. ఉదయం 6 గంటల నుంచి ఆలయ రాజగోపురం ఎదురుగా ఉన్న మాడవీధిలో ఈ కార్యక్రమం జరిగింది. ముందుగా కార్యక్రమాన్ని ఈవో వి.త్రినాథరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా విశాఖ ఎంపీ భరత్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మారుస్తున్నామని, అందులో భాగంగానే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ బాల్యం నుంచే యోగాసనాలు అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దేవస్థానం ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, ఈఈ రమణ, ఏఈవో ఆనంద్కుమార్ పాల్గొన్నారు.

ఆధ్యాత్మిక యోగం