మౌర్యకు పోర్టు చైర్మన్‌ అభినందన | - | Sakshi
Sakshi News home page

మౌర్యకు పోర్టు చైర్మన్‌ అభినందన

Jun 19 2025 3:51 AM | Updated on Jun 19 2025 3:51 AM

మౌర్యకు పోర్టు చైర్మన్‌ అభినందన

మౌర్యకు పోర్టు చైర్మన్‌ అభినందన

విశాఖ సిటీ: భారత్‌ తరఫున అండర్‌–19 వాలీబాల్‌ జట్టుకు ఎంపికై న మాస్టర్‌ మౌర్య నందమూడిని విశాఖ పోర్టు అథారిటీ చైర్మన్‌ డాక్టర్‌ ఎం.అంగముత్తు అభినందించారు. ఉజ్బెకిస్తాన్‌లో జరిగిన సీఏవీఏ వాలీబాల్‌ ఛాంపియన్‌షిప్‌ కోసం ఎంపిక కావడం విశాఖవాసులు గర్వించదగ్గ విషయమన్నారు. మౌర్య భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. పోర్టు కార్యదర్శి టి.వేణుగోపాల్‌ కూడా మౌర్యను అభినందించారు. మౌర్య తండ్రి పోర్ట్‌లో ఉద్యోగిగా ఉన్నారు.

అస్త్రం యాప్‌పై శిక్షణ

విశాఖ సిటీ : యోగాంధ్ర వేడుకలకు పెద్ద ఎత్తున జనసందోహం వస్తుండడంతో రహదారి రద్దీని సమర్థవంతంగా నిర్వహించేందుకు 182 మంది పోలీస్‌ సిబ్బందికి గురువారం అస్త్రం యాప్‌పై శిక్షణ ఇచ్చారు. పోలీస్‌ శాఖ, జీవీఎంసీ అధికారులతో కలిసి అర్కాడిస్‌ ఐబీఐ గ్రూప్‌ ఈ శిక్షణ అందజేసింది. యాప్‌లోని ముఖ్యమైన ఫీచర్లను ప్రాక్టికల్‌ డెమోలు, సిమ్యులేషన్‌ ద్వారా శిక్షణ ఇచ్చారు. అస్త్రం, జీపీఎస్‌ డేటా, సీసీ టీవీ ఫీడ్స్‌, ఏఐ విశ్లేషణల ద్వారా ట్రాఫిక్‌ రద్దీ ప్రాంతాలను గుర్తించి, ట్రాఫిక్‌ మళ్లింపు, సిగ్నల్‌ మేనేజ్‌మెంట్‌ను సమర్థవంతంగా అమలు చేయటానికి సహాయపడుతుందని తెలిపారు. ప్రజలు కూడా ఈ యాప్‌ ద్వారా ట్రాఫిక్‌ అప్డేట్స్‌, పార్కింగ్‌ సమాచారం తెలుసుకోవచ్చన్నారు. ప్రజలు ఈ అస్త్రం యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ప్రయాణాన్ని సమర్థవంతంగా ప్లాన్‌ చేసుకోవాలని సూచించారు.

సాహస అవార్డుల దరఖాస్తుకు 30 తుది గడువు

ఎంవీపీ కాలనీ: భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్‌ యూత్‌ ఎఫైర్స్‌ అండ్‌ స్పోర్ట్స్‌ ఆధ్వర్యంలో అందించే సాహస అవార్డుల దరఖాస్తు గడువు ఈ నెల 30తో ముగియనుందని జిల్లా యువజన సంక్షేమాధికారి కార్యాలయం తెలిపింది. టెన్జింగ్‌ నార్గే నేషనల్‌ అడ్వెంచర్‌ అవార్డ్‌–2024 పేరిట ఈ సాహస అవార్డులను ప్రదానం చేయనున్నారు. అద్భుత పనితీరు, అత్యుత్తమ నాయకత్వ లక్షణాలు, నిర్ధిష్ట సాహస విజయం సాధించిన వ్యక్తులు ఈ అవార్డులకు అర్హులు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 30 లోపు https://awards. gov. in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

సీఎం కాన్వాయ్‌ పార్కింగ్‌ ఏర్పాట్ల పరిశీలన

మహారాణిపేట: కలెక్టరేట్‌లో సీఎం చంద్రబాబు కాన్వాయ్‌ పార్కింగ్‌ ఏర్పాట్లను జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement