జగన్‌ కాన్వాయ్‌పై దాడి దుర్మార్గం | - | Sakshi
Sakshi News home page

జగన్‌ కాన్వాయ్‌పై దాడి దుర్మార్గం

Jun 12 2025 2:57 AM | Updated on Jun 12 2025 2:57 AM

జగన్‌ కాన్వాయ్‌పై దాడి దుర్మార్గం

జగన్‌ కాన్వాయ్‌పై దాడి దుర్మార్గం

సాక్షి, విశాఖపట్నం: పొగాకు రైతుల సమస్యలు తెలుసుకోవడానికి పొదిలి పర్యటనకు వెళ్లిన మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాన్వాయ్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ, రైతులకు అండగా నిలుస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఏదో విధంగా అడ్డుతొలగించుకోవాలని దాడులు చేస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో మహిళలకు రక్షణ లేదు.. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లేవు.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ విస్మరించి అన్ని వర్గాల వారినీ మోసం చేస్తున్న చంద్రబాబు సర్కార్‌ వైఫల్యాలను ఎత్తి చూపితే తప్పా? అంటూ ప్రశ్నించారు. ప్రజా సమస్యలను, వారికిచ్చిన హామీలను గాలికొదిలేసి చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని ఆరోపించారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక ఏదో విధంగా అలజడులు సృష్టించి, తద్వారా శాంతిభద్రతలకు ఆటంకం కలిగించడం, ఆ నెపాన్ని జగన్‌మోహన్‌రెడ్డిపై, వైఎస్సార్‌సీపీపై వేయాలనే కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయన్నారు. అందుకు నిదర్శనమే పొదిలి పర్యటనలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాన్వాయ్‌పై జరిగిన దాడి అని కె.కె.రాజు అన్నారు.

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement