వైఎస్సార్‌సీపీ జిల్లా అనుబంధ కమిటీల నియామకం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ జిల్లా అనుబంధ కమిటీల నియామకం

Jun 17 2025 4:50 AM | Updated on Jun 17 2025 4:50 AM

వైఎస్సార్‌సీపీ జిల్లా అనుబంధ కమిటీల నియామకం

వైఎస్సార్‌సీపీ జిల్లా అనుబంధ కమిటీల నియామకం

సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ విశాఖ జిల్లా 19 అనుబంధ విభాగాల కమిటీలను నియమించారు. ఈ మేరకు సోమవారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.

● జిల్లా బూత్‌ విభాగం కమిటీ ప్రధాన కార్యదర్శిగా అబ్దుల్‌ సఖి, కార్యదర్శులుగా చట్టి నూకరాజు, ఈది మధుబాబు, ఇద్దరు ఎగ్జిక్యూటివ్‌ మెంబర్స్‌ను నియమించారు.

● జిల్లా అంగన్‌వాడీ విభాగం కమిటీ ప్రధాన కార్యదర్శులుగా కొల్లి రమణమ్మ, పిలకా వరలక్ష్మి, కార్యదర్శులుగా సికల అనిత, పాల కుసుమకుమారితో పాటు నలుగురు ఎగ్జిక్యూటివ్‌ మెంబర్స్‌ను నియమించారు.

● జిల్లా బీసీ సెల్‌ కమిటీ ప్రధాన కార్యదర్శులుగా పాతపట్నం రామ్మోహన్‌, ఎన్నెటి రమణ, గంగల్ల లక్ష్మణరావు, కార్యదర్శులుగా వారధి పార్థి నరసింహమూర్తి, శిస్తు చంద్రశేఖర్‌తో పాటు తొమ్మిది మంది ఎగ్జిక్యూటివ్‌ మెంబర్స్‌కు చోటుకల్పించారు.

● జిల్లా క్రిస్టియన్‌ మైనారిటీ విభాగం కమిటీ వైస్‌ ప్రెసిడెంట్‌గా మోకాన సుధాకర్‌, ప్రధాన కార్యదర్శులుగా గొట్టివాడ దానయ్య, బండుకొండ నాగమణి, కార్యదర్శులుగా దమ్మ గోవింద్‌, కొండపల్లి చిట్టితల్లి, గంట్యాడ రూపావతితో పాటు ముగ్గురు ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లగా అవకాశం కల్పించారు.

● జిల్లా సాంస్కృతిక విభాగం కమిటీ వైస్‌ ప్రెసిడెంట్‌గా విశాఖ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన పడాల స్వప్న, ప్రధాన కార్యదర్శిగా శరగడం పద్మ, కార్యదర్శిగా కోన లక్ష్మితో పాటు నలుగురికి ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లగా స్థానం కల్పించారు.

● జిల్లా వైఎస్సార్‌టీయూసీ విభాగం కమిటీ వైస్‌ ప్రెసిడెంట్‌గా గాలి ప్రసాద్‌, ప్రధాన కార్యదర్శులుగా పిలకా వెంకట రమణ, కై లాస్‌ మాలిక్‌, కార్యదర్శులుగా వరపాల మహేష్‌, నడుపూరి అనిల్‌కుమార్‌, కంచు మూర్తి వెంకట రమణతో పాటు నలుగురిని ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లగా నియమించారు.

● జిల్లా చేనేత విభాగం కమిటీ వైస్‌ ప్రెసిడెంట్‌గా మీసాల రత్నం, ప్రధాన కార్యదర్శిగా నీలి శ్రీనివాసరావు, కార్యదర్శిగా కాపు విజయ, ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌గా కాలిపాక సంధ్యను నియమించారు.

● జిల్లా వలంటీర్‌ విభాగం కమిటీ వైస్‌ ప్రెసిడెంట్‌గా దూడ అప్పారావు, ప్రధాన కార్యదర్శిగా అన్నెపు సూర్యనారాయణ, కార్యదర్శులుగా డి.స్వరూపరాణి, గొండేసి గోవింద్‌ రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ మెంబర్స్‌గా బి.మోహన్‌రావు, జి.సూర్య ప్రకాష్‌, యాసలపు శ్రీనివాసరావు, బొజ్జ సంతోష్‌ సాగర్‌, శ్రీమంతపురం బానూజీరావు, బొడ్డు దుర్గారావు, బేతా శ్రీనివాసరావును నియమించారు.

● జిల్లా వాణిజ్య విభాగం కమిటీ ప్రధాన కార్యదర్శిగా దొడ్డి రమేష్‌కుమార్‌, కార్యదర్శులుగా వెలుగల జగదీష్‌, చెరుకూరి కుమార్‌, మీసాల సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లగా బి.దంతేశ్వరరావు, పులేకుర్తి శ్రీనివాసరావు, పశుపురెడ్డి అప్పారావు, చేకూరి ముకుందరావు, కోరాడ శ్రీనివాసరావును నియమించారు.

● జిల్లా సోషల్‌ మీడియా విభాగం కమిటీ ప్రధాన కార్యదర్శులుగా తండ్రంగి మహేష్‌బాబు, నల్ల రామకృష్ణ, వాసు పొట్నూరు, కార్యదర్శిగా కాండ్రేగుల త్రినాథ్‌తో పాటు ఏడుగురు ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లను నియమించారు

● జిల్లా ఎస్సీ విభాగం కమిటీ వైస్‌ ప్రెసిడెంట్‌లుగా కోనా శంకర్‌, ఎడ్ల సిద్ధార్థరాజు, ముంజేటి హనుమంతురావు, ప్రధాన కార్యదర్శిగా ఆరుగుల అప్పన్న, కార్యదర్శులుగా ధనల ఆంజనేయులబాబు, గారా కృపారావు, నేతల కుమార్‌, ఎగ్జిక్యూటివ్‌ మెంబర్స్‌గా 12 మందిని నియమించారు.

● జిల్లా ఆర్‌టీఐ విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌గా కోడూరి సుశీల, ప్రధాన కార్యదర్శులుగా మహ దశ్యం గోపి, గంట్యాడ కృష్ణమూర్తి, కార్యదర్శులు కె.సీతయ్యరెడ్డి, నక్క త్రినాఽథ్‌తో పాటు ఐదుగురు ఎగ్జిక్యూటివ్‌ మెంబర్స్‌ను నియమించారు.

● జిల్లా ప్రచార విభాగం కమిటీ ప్రెసిడెంట్‌గా జిలకర్ర నాగేంద్ర, ప్రధాన కార్యదర్శులుగా కసరి ఫణిదీప్తి, యలమంచిలి అప్పారావు యాదవ్‌, గవర నాయుడు, కార్యదర్శులుగా కోరబిల్లి మహేష్‌, బోరా అప్పలరెడ్డి, కొండపు సత్తిబాబుతో పాటు ఆరుగురు ఎగ్జిక్యూటివ్‌ మెంబర్స్‌ను నియమించారు.

● జిల్లా మైనారిటీ విభాగం కమిటీలో ప్రధాన కార్యదర్శులుగా నజమే అబ్బాస్‌, షేక్‌ రహమన్‌, కార్యదర్శులు మహ్మద్‌ హర్షద్‌, మహమద్‌ కరీన్‌ మిరిష్‌, షేక్‌ రజియ్య, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మెంబర్‌ను నియమించారు.

● జిల్లా మహిళా విభాగం కమిటీ ప్రధాన కార్యదర్శులుగా శరగడం వెంకట లక్ష్మి, పిలిరిచెట్టి సుజాత, కార్యదర్శులుగా మెట్ట దమయంతి, బాసంగి రాజేశ్వరి, కార్యదర్శులుగా కాండ్రుగుల కనకలక్ష్మి, కరణం లక్ష్మి, ఆరుగురు ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లను నియమించారు

● జిల్లా న్యాయ విభాగం కమిటీ ప్రధాన కార్యదర్శులుగా ఎండిబోయిన లక్ష్మి, రాయుడు సుబ్రహ్మణ్యం రవి, కార్యదర్శిగా వాగుపల్లి చిన్నారావును నియమించారు

● జిల్లా ఐటీ వింగ్‌ కార్యదర్శిగా గర్భాపు శ్యామ్‌కుమార్‌, ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌గా కోటాన శ్రీనివాసరావు, జిల్లా ఇంటలెక్చవల్స్‌ ఫోరం ప్రధాన కార్యదర్శిగా పేరం రామకృష్ణను నియమించారు.

● జిల్లా గ్రీవెన్స్‌ సెల్‌ కమిటీ ప్రధాన కార్యదర్శులుగా అల్లు రామగోవిందేశ్వరరావు, పెదిరెడ్డి చంద్రశేఖర్‌, కార్యదర్శులుగా జిరు శ్రీనివాస్‌, చరకాపు రామారావుతోపాటు ఏడుగురు ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లను నియమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement