పోర్ట్‌కు రెండు ప్రతిష్టాత్మక సీఎస్‌ఆర్‌ అవార్డులు | - | Sakshi
Sakshi News home page

పోర్ట్‌కు రెండు ప్రతిష్టాత్మక సీఎస్‌ఆర్‌ అవార్డులు

Jun 17 2025 4:49 AM | Updated on Jun 17 2025 4:49 AM

పోర్ట్‌కు రెండు ప్రతిష్టాత్మక సీఎస్‌ఆర్‌ అవార్డులు

పోర్ట్‌కు రెండు ప్రతిష్టాత్మక సీఎస్‌ఆర్‌ అవార్డులు

విశాఖ సిటీ: విశాఖ పోర్ట్‌ అథారిటీ(వీపీఏ)కు రెండు ప్రతిష్టాత్మక సీఎస్‌ఆర్‌ అవార్డులు లభించాయి. ఢిల్లీలో జరిగిన 11వ వార్షిక గ్రీన్‌టెక్‌ సీఎస్‌ఆర్‌ అవార్డ్స్‌–2025లో ఈ అవార్డులను అందజేశారు. హెల్త్‌ కేర్‌ ప్రమోషన్‌, నైపుణ్యాభివృద్ధి విభాగాల్లో వీపీఏ చేసిన కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ అవార్డులు దక్కాయి. ఈ అవార్డులు లభించడం పట్ల పోర్టు చైర్‌పర్సన్‌ డాక్టర్‌ ఎం.అంగముత్తు సంతోషం వ్యక్తం చేశారు. ఈ విజయానికి కారకులైన ఉద్యోగులను ప్రత్యేకంగా అభినందించారు. సామాజిక పరంగా సమగ్రాభివృద్ధికి ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలని పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement