
ఫోన్ ట్యాపింగ్ ప్రకంపణలు
తాండూరు: నియోజవర్గంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. శాసన సభ ఎన్నికల సమయంలో నియోజవకర్గంలోని కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ట్యాపింగ్ గురైన ఫోన్లకు సిట్ అధికారులు ఫోన్లు చేసి వివరాలను సేకరిస్తున్నారు. ఇందులో నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులతో పాటు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి పేరు వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది.
నిగ్గు తేల్చేందుకు స్టేట్మెంట్ రికార్డులు
బీఆర్ఎస్ హయాంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు తాండూరులో ప్రచారం జరిగింది. ఎన్నికల అనంతరం పలువురు నేతలు తమ ఫోన్లు ట్యాపింగ్ చేశారంటూ ఫిర్యాదు చేశారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని నిగ్గు తేల్చాలని సిట్ బృందానికి బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే పలువురు నేతలను సిట్ విచారించి స్టేట్మెంట్ రికార్డు చేశారు. మొదట రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సునీత భర్త డాక్టర్ సంపత్కుమార్ ఫోన్ ట్యాపింగ్పై సిట్ అధికారుల బృందం రెండు రోజుల క్రితం ఫోన్ చేసి స్టేట్మెంట్ ఇచ్చేందుకు నగరానికి రావాలని కోరారు. ఈ విషయాన్ని డాక్టర్ సంపత్కుమార్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి సోదరుడు ఆర్బీఎల్ కంపెనీ చైర్మన్ బుయ్యని శ్రీనివాస్రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్తో పాటు పలువురు యువ నాయకులకు సిట్ నుంచి కాల్స్ వస్తున్నాయి. పలువురు మీడియా ప్రతినిధులకు చెందిన ఫోన్లను సైతం ట్యాపింగ్ చేసినట్లు సమాచారం.
పట్నం అనుచరుల ఫోన్లు ట్యాపింగ్
తాండూరు నియోజవకర్గంలో 2023లో బీఆర్ఎస్లో ఉన్న మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి అనుచరుల ఫోన్లు ట్యాపింగ్ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పట్నం ప్రధాన అనుచరులకు సిట్ నుంచి కాల్స్ను అందుకున్నారు.
సిట్ అధికారుల విచారణలో విస్తుపోయే విషయాలు
తాండూరులో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల ఫోన్లతో పాటు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఫోన్ ట్యాప్
విచారణకు హాజరుకావాలని పలువురికి కాల్స్ చేసిన సిట్ బృందం