
సదస్సుల్లోనే సమస్యలు పరిష్కరించండి
అనంతగిరి: భూ సమస్యలను సాధ్యమైనంత వరకు రెవెన్యూ సదస్సుల్లోనే పరిష్కరించాలని కలెక్టర్ ప్రతీక్జైన్ అధికారులకు సూచించారు. గురవారం ఆయన వికారాబాద్ మండలం అత్వెల్లి, కొత్రేపల్లిలో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రెవెన్యూ సదస్సులు భూ సమస్యల పరిష్కార వేదికలుగా ఉపయోగపడుతున్నాయని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. దరఖాస్తులు స్వీకరించి వాటికి రసీదులు ఇవ్వాలని... ఆన్లైన్లో తప్పులు దొర్లకుండా జాగ్రత్తగా నమోదు చేయాలని సూచించారు. దరఖాస్తుల స్వీకరణ నమోదు రిజిస్టర్లను పరిశీలించి పలు సూచనలు ఇచ్చారు. తహసీల్దార్ స్థాయిలో సమస్యలుంటే వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, ఆర్డీఓ వాసుచంద్ర, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రతీక్జైన్