మట్టి అక్రమ రవాణా | - | Sakshi
Sakshi News home page

మట్టి అక్రమ రవాణా

Jul 25 2025 4:21 AM | Updated on Jul 25 2025 4:21 AM

మట్టి అక్రమ రవాణా

మట్టి అక్రమ రవాణా

● ప్రైవేటు వెంచర్లకు తరలింపు ● ఎమ్మెల్యే అనధికార పీఏ హస్తం

టాస్క్‌ఫోర్స్‌ : మట్టి మాఫియా కాసులు కురిపిస్తోంది. అధికారం మాటున అక్రమ రవాణా సాగుతోంది. మైనింగ్‌ , రెవెన్యూ, పోలీసు అధికారుల కళ్లెదుటే పెద్ద సంఖ్యలో వాహనాల్లో మట్టి అక్రమ రవాణా జరుగుతున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. తొట్టంబేడు మండలంలో విరుపాక్షపురం చెరువులో మట్టి తవ్వి ట్రాక్టర్లతో శ్రీకాళహస్తి మండలంలోని పెనుబాకలో ఓ ప్రైవేట్‌ వెంచరుకు వందల ట్రాక్టర్లు తరలిస్తున్నారు. అధికార పార్టీ అండదండలు ఉండడతో అక్రమ రవాణాను అడ్డుకునే వారే లేకుండా పోయారు. సాక్షాత్తు ఎమ్మెల్యే అనధికారిక పీఏ ఈ అక్రమ రవాణాలో పాత్ర ఉండడంతో అడ్డుకునే ధైర్యం ఎవరూ చేయడం లేదు. చెరువుల నుంచి వందల ట్రాక్టర్లు మట్టి అక్రమంగా తరలిస్తున్నా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడం ఆందోళన కలిగిస్తోంది.

దరఖాస్తుల ఆహ్వానం

తొట్టంబేడు: కేంద్ర కార్మిక, ఉపాధిశాఖ పరిధిలో పనిచేస్తున్న బీడీ కార్మికుల కుటుంబాలకు చెందిన విద్యార్థులకు 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి ఉపకార వేతనాలు అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు శ్రీకాళహస్తి బీడీ కార్మికుల వైద్యాధికారి డాక్టర్‌ వెంకట భాస్కర్‌ తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఆగస్టు 31లోపు, ఇంటర్‌ డిగ్రీ, ఐఐటీ, ప్రొఫెషనల్‌ కోర్సులు చేసే విద్యార్థులు అక్టోబరు 31న నాటికి సంబంధిత వైబ్సెట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement