నచ్చిన రాఖీ.. మెచ్చిన సందేశం..  | You Can Get Rakhi In Indian Post By Epass | Sakshi
Sakshi News home page

 రూ.100 చెల్లించి క్లిక్‌ చేస్తే చాలు.. 

Jul 31 2021 8:00 AM | Updated on Jul 31 2021 9:37 AM

You Can Get Rakhi In Indian Post By Epass - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసి అందులో ఉన్న ఫొటోల్లో నచ్చిన రాఖీని ఎంపిక చేసుకొని.. అక్కడే ఉన్న నచ్చిన సందేశాన్ని కూడా క్లిక్‌ చేసి పంపాల్సిన చిరునామా టైప్‌ చేసేసి.. రూ.100 చెల్లిస్తే స్పీడ్‌ పోస్టులో సందేశంతోపాటు ఎంపిక చేసిన రాఖీ ఆ అడ్రస్‌కు చేరిపోతుంది. తొలిసారి రాఖీని ఈ–షాప్‌ పద్ధతిలో సోదరులకు పంపే ఏర్పాటు చేసింది. తపాలాశాఖ ఠీఠీఠీ.్ఛటజిౌp.్టటఞౌట్టట.జీn వెబ్‌సైట్‌ ద్వారా ఈ అవకాశం లభించనుంది. శుక్రవారం తపాలాశాఖ తెలంగాణ సర్కిల్‌ చీఫ్‌ పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ రాజేంద్రకుమార్‌ దీన్ని ప్రారంభించారు. వెబ్‌సైట్‌లో రకరకాల నమూనాల రాఖీల చిత్రాలుంటాయి. పోస్టల్‌ కవర్, అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ సందేశాలుంటాయి.

Advertisement
 
Advertisement
Advertisement