తలకొరివి పెట్టిన భార్య  | Wife Conducting Her Husband Funeral In Kamareddy | Sakshi
Sakshi News home page

తలకొరివి పెట్టిన భార్య 

Feb 27 2023 2:14 AM | Updated on Feb 27 2023 2:14 AM

Wife Conducting Her Husband Funeral In Kamareddy - Sakshi

భర్త అంత్యక్రియలు  నిర్వహిస్తున్న శ్యామల 

కామారెడ్డి టౌన్‌: అనారోగ్యంతో కన్నుమూసిన భర్తకు అతని భార్య తలకొరివి పెట్టింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లికి చెందిన నాగల్ల రమేశ్‌ పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో కాంపౌండర్‌గా పని చేస్తున్నాడు. ఈనెల 20న గుండెపోటు రావడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. శస్త్రచికిత్స కోసం రూ.8 లక్షలు అవసరమని వైద్యులు చెప్పారు.

పేద కుటుంబానికి చెందిన రమేశ్‌ దుస్థితిపై ‘సాక్షి’ప్రచురించిన కథనానికి పలువురు స్పందించి ఆర్థిక సాయం అందించారు. కానీ అప్పటికే శస్త్రచికిత్స ఆలస్యం కావడంతో రమేశ్‌ శనివారం మరణించాడు. సంతానం ఇద్దరూ కూతుళ్లే కావడంతో భార్య శ్యామలే ఆదివారం దేవునిపల్లిలో భర్త చితికి నిప్పు పెట్టి అంత్యక్రియలు పూర్తి చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement