 
													సాక్షి, హనుమకొండ: ఎల్కతుర్తి మండలం గోపాల్పుర్ క్రాస్ రోడ్డు వద్ద రాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.
పెళ్లి బృందంతో వస్తున్న బోలెరో వాహనాన్ని లారీ ఢీ కొట్టడంతో ఈ ఘోరం చోటు చేసుకుంది. గాయపడిన మరో 12 మందిని ఎంజీఎంకు తరలించారు. వాళ్లలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులు కురవి మండలం సుధాన్పల్లివాసులుగా పోలీసులు నిర్ధారించారు. వాళ్ల పేర్లు వెల్లడించాల్సి ఉంది.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
