TS Govt to Issue Pottery Units Worth 1 Lakh to Pot Makers - Sakshi
Sakshi News home page

కుమ్మరి కులవృత్తిదారులకు సర్కారు చేయూత

Sep 13 2021 5:07 AM | Updated on Sep 13 2021 10:35 AM

TS Government Give Pottery Units To Kummari Community - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కుమ్మరి కులవృత్తిదారులకు చేయూతనందించాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా బీసీ కార్పొరేషన్‌ ద్వారా శిక్షణ పొందిన 320 మందికి త్వరలో పాటరీ యూనిట్లు అందించనుంది. ఈ మేరకు బీసీ కార్పొరేషన్‌ వీసీఎండీ అలోక్‌కుమార్‌ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. పాటరీ యూనిట్‌లోని యంత్రాల విలువ లక్ష రూపాయల వరకు ఉంటుందని పేర్కొన్నారు.

ఈ యంత్రాలతో మట్టిపాత్రలు, కూజాలు, మట్టి వాటర్‌ బాటిళ్లు, టీ కప్పులు, మట్టి విగ్రహాలు, దీపాలు, ఇతరత్రా అలంకరణ సామాగ్రిని వేగంగా, వివిధ డిజైన్లతో రూపొందించడానికి వీలుంటుందని అలోక్‌కుమార్‌ వివరించారు. పాటరీ యంత్రాలను రూ.80 వేల రాయితీతో అందిస్తామని పేర్కొన్నారు. అలాగే హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని కుమ్మరి వృత్తిదారుల ఆర్థిక స్వావలంబనకు ఆధునిక యంత్రాలను అందించనున్నట్లు వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement