
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నీటిపారుదల శాఖ ఈఎన్సి అనిల్ కుమార్ బదిలీ వేటు పడింది. ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాహుల్ బొజ్జా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
అయితే, మేడిగడ్డ ఆనకట్ట గ్రౌటింగ్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం అనిల్ కుమార్పై బదిలీ వేటువేసినట్లు సమాచారం. ఏసీబీ దాడిలో అరెస్ట్ అయిన ఈఈ శ్రీధర్ విషయంలో కలగజేసుకున్నారని అనిల్పై ఆరోపణలు ఉన్నాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలలో బుంగలు పూడ్చాడని (గ్రౌటింగ్)అనిల్పై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలపై ఎవరి ఆదేశాల మేరకు గ్రౌటింగ్ చేశారని అనిల్ కుమార్పై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం తాజాగా చర్యలకు ఉపక్రమించింది. నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా మెమో జారీ చేసినట్లు సమాచారం.