యువకుడిపై కేసు నమోదు
హైదరాబాద్: హాస్టల్లో నివాసముంటున్న ఓ యువకుడు హాస్టల్ యజమాని కుమార్తె స్నానం చేస్తుండగా ఫొటోలు తీయడంతో అతడిని రెడ్హ్యాండెడ్గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎస్ఆర్నగర్ బాపూనగర్లోని ప్రైవేటు హాస్టల్లో వరంగల్ జిల్లా, గీసుకొండకు చెందిన రంజిత్ (28) ఉంటున్నాడు.
సేల్స్ మెన్గా పనిచేసే రంజిత్ హాస్టల్ యజమాని కుమార్తె స్నానం చేస్తుండగా కిటికీలో నుంచి రహస్యంగా ఫొటోలు తీశాడు. దీనిని గుర్తించిన సదరు యువతి కేకలు వేయడంతో అక్కడికి చేరుకున్న స్థానికులు రంజిత్ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


