సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) చంద్రశేఖర్ తివారీతో శుక్రవారం మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సీహెచ్ మల్లారెడ్డి కోడలు ప్రీతీరెడ్డి భేటీ అయ్యారు. బీజేపీలో చేరేందుకే ఆమె వచ్చారంటూ ఊహాగానాలు సాగాయి. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ..
ఏఐ యూనివర్సిటీ ప్రారం¿ోత్సవానికి ఆహ్వానం అందించేందుకే వచ్చాన న్నారు. ఇందులో రాజకీయ ప్రాధాన్యం లేదని స్పష్టం చేశారు. అయితే భవిష్యత్లో ఏమైనా జరగొచ్చని వ్యాఖ్యానించారు. ఎంపీ టికెట్ కోసం తాను రాలేదని, ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని చెప్పారు. మామ మల్లారెడ్డి రాజకీయాల్లో ఉన్నారని, ఆయన తమలో ఎవరినైనా పోటీ చేయమంటే సిద్ధమని స్పష్టం చేశారు.


