Lockdown Violation in Hyderabad: వీళ్లింతేనా.. మారరా..?
లాక్డౌన్ సడలింపు సమయం దాటాక పౌరులెవరూ బయటకు రావొద్దని ఇటు పోలీసులు, అటు అధికారులు ఎంతగా మొత్తుకుని చెబుతున్నా మనోళ్లు మారడం లేదు. ఓ వైపు జరిమానాలు విధిస్తూ.. ఎక్కడిక్కడ అడ్డుకుంటూ పోలీసులు గట్టి చర్యలు చేపడుతున్నా చాలా మంది వాహనదారులు ఉదయం 10 గంటల తర్వాత కూడా బయట తిరుగుతూనే ఉన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా జనంలో మార్పు రావాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. లాక్డౌన్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
- సాక్షి, హైదరాబాద్
లాక్డౌన్ సడలింపు సమయం ముగిశాక ముషీరాబాద్ రోడ్డులో బారులు తీరిన వాహనాలు
చదవండి:
ఓ వైపు దండం.. మరోవైపు దండన!