యాదాద్రికి కార్తీకం తాకిడి  

Huge Devotees Crowd In Yadadri Temple Due To Karthika masam - Sakshi

ధర్మ దర్శనానికి 3 గంటల సమయం   

యాదగిరిగుట్ట : కార్తీక మాసం కావడంతో యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. హైదరాబాద్‌ జంటనగరాలతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా తరలి వచ్చారు. సుమారు 40 వేల మంది స్వామి వారిని దర్శించుకున్నారు. ధర్మ దర్శనానికి 3 గంటలు, రూ.150 టికెట్‌ దర్శనానికి గంటన్నర సమయం పట్టిందని భక్తులు తెలిపారు. 734 జంటలు వ్రత పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. వ్రతాలు, నిత్య పూజల ద్వారా ఆదివారం ఒక్కరోజే రూ.52,17,063 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top