సాక్షి, నిజామాబాద్: ఆర్మూర్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉర్దూ టీచర్పై దాడికి పాల్పడ్డ బీజేపీ నేత బాలును పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఆ ప్రాంతంలో హైటెన్షన్ నెలకొంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు 24 గంటల పాటు 144 సెక్షన్ విధించారు. ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలపై నిషేదం విధించారు.