హెదరాబాద్: ఎండలతో ఠారెక్కిపోతున్న తెలుగురాష్ట్రాల ప్రజలకు వరుణుడు ఒక్కసారిగా ఉపశమనం కల్పించారు. ఎండలతో మండిపోతున్న వాతావరణం ఒక్కసారిగా వర్షం కురిసింది. విజయవాడలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లపైకి నీరు చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా పలుజిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
మరోవైపు తెలంగాణలోనూ పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. కామారెడ్డి, కరీంనగర్లో భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులపైకి నీరు చేరింది. అదేవిధంగా పెద్దపల్లి, సుల్తానాబాద్ మండలాల్లో మోస్తారుగా వానలు కురిశాయి. ఎండల తీవ్రతతో తల్లడిల్లిపోయిన ప్రజలకు ఈ వర్షాలు కొంతమేర ఉపశమనం కల్పించాయి.


