సోనియా త్యాగంతోనే తెలంగాణ వచ్చింది | Hyderabad: Gaddar's Family Members Meet Sonia Gandhi And Rahul Gandhi - Sakshi
Sakshi News home page

సోనియా త్యాగంతోనే తెలంగాణ వచ్చింది

Sep 18 2023 2:43 AM | Updated on Sep 19 2023 8:02 PM

Gaddar Family Members Meet Sonia Gandhi And Rahul Gandhi - Sakshi

లక్డీకాపూల్‌ (హైదరాబా ద్‌): సోనియా గాంధీ త్యాగంతోనే ప్రత్యేక తెలంగాణ వచ్చిందని దివంగత ప్రజాగాయకుడు గద్దర్‌ సతీమణి విమల అన్నారు. ఆమె త్యాగనిరతి ఏంటో తనకు తెలుసని స్పష్టం చేశారు. సీడబ్ల్యూసీ సమావేశాలలో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వచ్చిన సోనియా గాంధీ ఆదివారం గద్దర్‌ కుటుంబాన్ని ఓదార్చారు.

ఆరోగ్య కారణాల రీత్యా సోనియా తాను బస చేసిన తాజ్‌ కృష్ణా హోటల్‌కే విమలను పిలిపించుకున్నారు.ఆమెతో పాటు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీలు కూడా గద్దర్‌ కుటుంబాన్ని ఓదార్చారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ మాట్లాడుతూ.. ప్రజల హక్కుల కోసం గద్దర్‌ చేసిన పోరాటాలను కొనియాడారు. రాహుల్‌ స్పందిస్తూ.. గద్దర్‌ తనకు అత్యంత ప్రియమైన వ్యక్తి అని సోనియా, ప్రియాంకలకు చెప్పారు.

ఆయన గద్దర్‌ కుటుంబానికి ధైర్యం చెప్పారు. అనంతరం విమల మీడియాతో మాట్లాడు తూ.. త్యాగమంటే ఏంటో సోనియాకు తెలు సు కాబట్టే ఆమెను కలవాలనుకున్నానని చెప్పారు. ఆ త్యాగం కేసీఆర్‌కు తెలియదని, ఆయన నిరాహార దీక్షలతో తెలంగాణ సిద్ధంగా లేదని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే రాజ్యాంగాన్ని పరిరక్షిస్తుందని విమల స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement