Telangana Ex Minister, Etela Rajender Safely Reurn To Hyderabad - Sakshi
Sakshi News home page

క్షేమంగా ఇంటికి చేరిన ఈటల

Jun 15 2021 1:26 PM | Updated on Jun 15 2021 1:42 PM

Etela Rajender Safely Reached To Hyderabad - Sakshi

ఈటల రాజేందర్‌ (ఫైల్‌ ఫోటో)

హైదరాబాద్‌: ఈటల రాజేందర్‌ బృందం క్షేమంగా హైదరాబాద్‌కు చేరుకుంది. విమానాశ్రయంలో దిగిన ఈటల నేరుగా శామీర్‌పేట్‌లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. అయితే ఈటల రాజేందర్‌ బృందానికి ఉదయం ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. ఈటల బృందం ఢిల్లీ నుంచి వస్తున్న విమానంలో సాంకేతిక సమస్య చోటు చేసుకుంది. దీంతో పైలట్‌ అలెర్ట్‌ అవ్వటంతో పెను ప్రమాదం తప్పింది. 

ఇటీవల టీఆర్‌ఎస్‌కి గుడ్‌ బై చెప్పిన ఈటలకు సోమవారం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్ బీజేపీ సభ్యత్వం ఇచ్చారు. ఈటలతో పాటు మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి , మాజీ జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, తెలంగాణ ఆర్టీసీ నేత అశ్వద్ధామ రెడ్డి బీజేపీలో చేరారు.

చదవండి: టీఆర్‌ఎస్‌ నాయకుడి ఇంట్లో అర్థరాత్రి రికార్డింగ్‌ డ్యాన్స్‌లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement