జేసీ ప్రభాకర్‌రెడ్డిని రెండోరోజూ ప్రశ్నించిన ఈడీ | ED Questioned JC Prabhakar Reddy On Second Day | Sakshi
Sakshi News home page

జేసీ ప్రభాకర్‌రెడ్డిని రెండోరోజూ ప్రశ్నించిన ఈడీ

Oct 9 2022 1:47 AM | Updated on Oct 9 2022 1:47 AM

ED Questioned JC Prabhakar Reddy On Second Day - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న తాడిపత్రి మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు హైదరాబాద్‌ కార్యాలయంలో శనివారం వరుసగా రెండోరోజుసైతం సుదీర్ఘంగా ప్రశ్నించారు. శుక్రవా­రం దాదాపు 9 గంటలపాటు విచారించిన అధికా­రులు... శనివారం ఉదయం 10 గంటల నుంచే ఆయనను ప్రశ్నించడం ప్రారంభించారు.

స్క్రాప్‌గా కొన్న బీఎస్‌–3 వాహనాలను బీఎస్‌–4 వాహనా­లుగా పేర్కొంటూ తప్పుడు పత్రాలు సృష్టించడమే కాకుండా వాటిని విక్రయించేందుకు డమ్మీ కంపెనీలు సృష్టించి భారీ ఎత్తున మనీలాండరింగ్‌కు పా­ల్ప­డినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. అమ్మకాలు, నిధుల మళ్లింపునకు సంబంధించిన ఆధారాలు ముందుంచి జేసీని అధికారులు ప్రశ్నించారు. జేసీ కు­టుంబం నిర్వహిస్తున్న జఠాధర ఇండస్ట్రీస్‌ పేరుతో వాహనాలు కొనుగోలు చేసినట్లు తెలిసింది. తప్పుడు పత్రాల సృష్టికి సంబంధించి గతంలో ఏపీ రవాణా శాఖ నమోదు చేసిన కేసుల వివరాలను కూడా ఈడీ అధికారులు సేకరించినట్లు తెలిసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement