సాక్షి,హైదరాబాద్: తాను కొత్త పార్టీని స్థాపించబోతున్నట్లు వస్తున్న వార్తల్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఖండించారు. బండి భగీరథ్ కేసు వివాదం తర్వాత తొలిసారి తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. కేటీఆర్ ఫేక్ మీడియా ఫ్యాక్టరీని నడిపిస్తున్నారు. నేనేంటో ప్రజలకు తెలుసు. కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచనలు నాకు లేవు. ఎవరెవరో ఏదో రాస్తారు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బండి భగీరథ్ కేసు కోర్టు పరిధిలో ఉంది. ఏదైనా సందర్భంగా కొడుకును తండ్రి పోలీసులకు అప్పగించిన సందర్భం ఏదైనా ఉందా?. విచారణ నిమిత్తం నేనే స్వయంగా భగీరథ్ను పోలీసులకు అప్పగించా’నని వ్యాఖ్యానించారు.


