నగల చోరీ కేసులో యువకుడి అరెస్టు
తిరువొత్తియూరు: చైన్నె పురసైవాక్కంలో కళాశాల వి ద్యార్థిని నగలు చోరీ చేసిన యువకుడిని పోలీసులు 24 గంటల్లోనే అరెస్టు చేశారు. పురసైవాక్కం చూలై షావుకార్పేటకు చెందిన పరమశివం కుమార్తె రుద్రవాణి మూడో సంవత్సరం డిగ్రీ చదువుతోంది. ఆమె సోమ వారం రాత్రి పురసైవాక్కంలో వున్న ప్రముఖ జౌళి దుకాణంలో దుస్తులు తీసుకుని స్నేహితులతో కలిసి ఇంటికి బయలుదేరింది. మోటారు సైకిల్లో వచ్చిన యువకుడు ఆమె మెడలో వున్న ఒకటిన్నర సవర్ల బంగారు చైన్ను లాక్కుని పారిపోయాడు. ఫిర్యాదు అందుకున్న వెప్పేరి సహాయ కమిషనర్ హరికుమార్, పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టి నిఘా కెమెరాల ఆధారంగా నగలు అపహరించిన యువకుడు పురసైవాక్కం ఎస్ఎస్ పురానికి చెందిన వినోద్కుమార్గా గుర్తించారు. అతను ప్రైవేటు క్లబ్బులో పనిచేస్తున్నాడు. మద్యం తాగేందుకు చైన్ స్నాచింగ్ చేసినట్టు తెలిసింది. వినోద్కుమార్ను అరెస్టు చేశారు. అతని నుంచి చైన్ను స్వాధీనం చేసుకుని విద్యార్థినికి అప్పగించారు. 24 గంటల్లోనే దుండగుడిని అరెస్టు చేసిన పోలీసులను స్థానికులు అభినందించారు.