ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సభ్యుడిగా వెంకటరమణ | - | Sakshi
Sakshi News home page

ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సభ్యుడిగా వెంకటరమణ

Jun 20 2025 5:25 AM | Updated on Jun 20 2025 5:25 AM

ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సభ్యుడిగా వెంకటరమణ

ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సభ్యుడిగా వెంకటరమణ

కోదాడరూరల్‌ : కోదాడ మండల పరిధిలోని కాపుగల్లుకు చెందిన ముత్తవరపు వెంకటరమణ ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సభ్యుడిగా ఎంపికయ్యారు. ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌(ఏఐసీటీఈ) వారు బుధవారం న్యూఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో ఎంపిక చేశారు. ఇండియాలో ఫార్మసీ విద్యను అభివృద్ధి చేయడం, కొత్త కళాశాలల మంజూరుతో పాటు రెన్యువల్‌ చేయడంలో కీలకపాత్ర పోషించనున్నారు. ముత్తవరపు భాస్కర్‌రావు, కుమారి దంపతుల కుమారుడు వెంకటరమణ 10వ తరగతి వర కు కోదాడ సెయింట్‌ జోసెఫ్‌ సీసీరెడ్డి పాఠశాలలో, ఇంటర్‌ విజయవాడ విశ్వశ్రీ కళాశాలలో , బీఫార్మసీని కర్ణాటకలో, ఎం ఫార్మసీ అన్నామలై యూనివర్సిటీలో, పీహెచ్‌డీ నాగార్జున యూనివర్సిటీలో పూర్తి చేశారు. ఆయన ప్రస్తుతం మొయినాబాద్‌లోని ఆజాద్‌ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్‌గా, నేషనల్‌ ఫార్మసీ టీచర్స్‌ అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. ఆయనను డీసీసీబీ మాజీ చైర్మన్‌ పాండురంగారావు, కాపుగల్లు మాజీ సర్పంచ్‌ సతీష్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ సూర్యం, రిటైర్డ్‌ హెచ్‌ఎం రామారావు, హనుమంతరావు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement