
ఇరాన్పై యుద్ధాన్ని ఆపాలి
సూర్యాపేట అర్బన్ : ఇరాన్పై ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధాన్ని నిలిపి శాంతిని నెలకొల్పాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్కుమార్ డిమాండ్ చేశారు. పాలస్తీనా, ఇరాన్లపై ఇజ్రాయిల్ దాడులు చేయడాన్ని నిరసిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో గురువారం సూర్యాపేట కొత్త బస్టాండ్ వద్ద ఇజ్రాయిల్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా నాయకుడు బూర వెంకటేశ్వర్లు, సీపీఎం జిల్లా నాయకుడు కోట గోపి, ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి ఎస్కే నజీర్లతో కలిసి ఆయన మాట్లాడారు. ఇజ్రాయిల్ అణ్వాయుధాలు ఉన్నాయనే పేరుతోఈ నెల 13నుంచి ఇరాన్పై క్షిపణి దాడులు చేసిందని, ఆయిల్ కంపెనీల పైన, నివాసాలపైన బాంబులు వేయడం మూలంగా పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాలతో లక్షలాది మంది ఉద్యోగులు, విద్యార్థులు మన దేశానికి తిరిగి చేరుకుంటున్నారని అన్నారు. కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు గంట నాగయ్య, వరికుప్పల వెంకన్న, చెరుకు ఏకలక్ష్మి, కునుకుంట్ల సైదులు, బొడ్డు శంకర్, అలుగువెల్లి వెంకటరెడ్డి, పోలబోయిన కిరణ్, పుల్లూరి సింహాద్రి, దనియాకుల శ్రీకాంత్వర్మ, తదితరులు పాల్గొన్నారు.