అన్నదాతలకు యూరియా కష్టాలు | - | Sakshi
Sakshi News home page

అన్నదాతలకు యూరియా కష్టాలు

Aug 19 2026 12:24 AM | Updated on Aug 19 2026 12:24 AM

పాతపట్నం: ప్రభుత్వం ఎరువుల పంపిణీకి సంబంధించి నూతనంగా యాప్‌ను తీసుకొచ్చింది. యాప్‌లో పేరుంటేనే ఎరువులు పంపిణీ చేయాల ని నిబంధన విధించారు. యాప్‌లో పేర్లు లేని వారు వ్యవసాయాధికారుల వద్దకు వెళ్లి పేర్లు నమోదు చేయించుకోవాలని సూచించారు. రైతుల వద్ద స్మార్ట్‌ ఫోన్లు ఉన్నా బుకింగ్‌ ఓటీపీ, సర్వర్‌ డౌన్‌, తదితర సమస్యలతో ఎరువులు బుకింగ్‌ సకాలంలో పూర్తి కావడం లేదు. దీంతో పంటలకు అవసరమైన సమయంలో యూరియా, డీఏపీ, ఎరువులు సకాలంలో లభించక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరా వరి పంటకు మూడు బస్తాలు కావాల్సి ఉండగా 75 కిలోల యూరియాను మాత్రమే అందిస్తామని, అది కూడా ఫోన్‌ యాప్‌లో ఒకే అయితేనని అధికారులు చెబుతున్నా రు. మంగళవారం గంగువాడలో డీఏపీ కోసం గంటల కొద్దీ లైన్‌లో ఉన్నామని రైతులు వాపోయారు. దీంతో యూరియా, డీఏపీ కోసం పనులు మానుకుని రైతు సేవా కేంద్రాలు, ప్రైవేటు డీలర్ల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement