ఎవరి సహకారంతో గెలిచారో వారిని దూరం పెట్టడం చంద్రబాబు ఒక్కడికే చెల్లుబాటు. గతేడాది తుఫాన్లకు జిల్లాలో 30 వేలు ఎకరాలు తీవ్రంగా నష్టపోతే ఒక్క రైతుకూ నష్టపరిహారం ఇవ్వకపోవడం వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడి చేతకానితనానికి నిదర్శనం. వరి పండించవద్దని మంత్రి చెప్పడం దారుణం. ఎకరాకు ఎన్ని విత్తనాలు వెయ్యాలో, ఎంత ఎరువు వెయ్యాలో ప్రతి రైతుకీ తెలుసు..కొత్తగా చంద్రబాబు, అచ్చెన్నాయుడులు నేర్పించాల్సిన పని లేదు. కూటమి పాలనలో విత్తనాల నుంచి ధాన్యం అమ్మే వరకు ప్రతిదానికీ లంచం ఇస్తేనే పని జరుగుతోంది.
–పేరాడ తిలక్, వైఎస్సార్సీపీ
టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త


