టీడీపీ అధికారంలోకి వచ్చాక జిల్లాకు జరిగిన మేలు ఒక్కటి కూడా లేదు. అంతకుముందు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నా జిల్లాపై వెనుకబాటు ముద్రను చెరపలేకపోయారు. జిల్లాలో ఆయన మార్క్ అంటూ ఏదీ లేదు. ఉన్న భవనాలు, ప్రాజెక్టులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హయాంలో జరిగినవే.
● అరసవల్లి సూర్య దేవాలయం అభివృద్ధికి రూ.100కోట్ల ప్రాజెక్టు మంజూరు చేస్తామన్నారు. ఒక్క రూపాయి ఇవ్వలేదు.
● ఎన్నికల సమయంలో లెక్కలేనన్ని హామీలు
● ఒక్కటీ అమలు చేయని దుస్థితి
● అధికారంలోకి వచ్చాక ఎడాపెడా
వాగ్దానాలు
● వాటికీ అతీగతి లేదు
● తాజాగా నరసన్నపేటలో స్వర్ణాంధ్ర
● స్వచ్ఛాంధ్ర పేరుతో సీఎం పర్యటన


