న్యూస్రీల్
శనివారం శ్రీ 16 శ్రీ మే శ్రీ 2026
ఎన్నికల్లో గెలిచే వరకు ఓ మాట.. గెలిచాక మరో మాట.. సీఎం చంద్రబాబు జిల్లాపై అవలంబిస్తున్న తీరు ఇది. ప్రస్తుతం జిల్లాలో రెడ్బుక్, మాఫియా రాజ్యంతో స్కామ్ల పాలన తప్ప ఇంకేమీ జరగడం లేదు. పాత పథకాలకు పాతరేశారు. కొత్త పథకాల ఊసే లేదు. అధికారంలోకి వచ్చాక జిల్లాకు వచ్చిన ప్రతి సారీ హామీలు ఇస్తున్నా.. వాటిని అమలు చేసిన దాఖలా ఒక్కటి కూడా లేదు. తాజాగా నరసన్నపేటకు స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కోసం సీఎం శనివారం వస్తున్నారు. –సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం


