న్యూస్రీల్
నరసన్నపేటలో సమస్యల తిష్ట చెరువుల్లో పెరిగిన ఆక్రమణలు అభివృద్ధికి నోచుకోని రాజుల చెరువు పూర్తి కాని మినీ స్టేడియం రేపు నరసన్నపేటకు సీఎం రాక
నాడు కళకళ.. నేడు వెలవెలమహిళా మార్టు వెలవెలబోతోంది. విక్రయాలు పడిపోయాయి. –8లో
అభివృద్ధికి నోచుకోని రాజుల చెరువు
పట్టణం నడిబొడ్డున ఉన్న రాజుల చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రతిపక్ష నాయకునిగా ఉన్నప్పుడు పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు రాజుల చెరువును అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పుడు అధికారం చేపట్టి రెండేళ్లు దాటిపోయింది. ఇప్పుడు మళ్లీ నరసన్నపేటకు వస్తున్నారు. రాజుల చెరువు అభివృద్ధికి నిధులు కేటాయిస్తారని స్థానికులు ఎదురు చూస్తున్నారు.


