రాష్ట్ర బార్కౌన్సిల్కు రెండు నామినేషన్లు
శ్రీకాకుళం పాతబస్టాండ్: న్యాయవాదుల రాష్ట్ర బార్ కౌన్సిల్కు ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారి, ఇతర సభ్యులతో కలిసి 25 మందిని ఎన్నుకుంటారు. ఫిబ్రవరి 13న జరిగే ఈ ఎన్నికకు జిల్లా నుంచి ఇద్దరు న్యాయవాదులు కిల్లి మార్కండేశ్వరరావు, గేదెల వాసుదేవరావు నామినేషన్ వేశారు. వీరిలో ఇప్పటికే బార్ కౌన్సిల్ సభ్యులుగా గేదెల వాసుదేవరావు ఉండగా, కొత్తగా జిల్లా నుంచి మార్కండేశ్వరరావు పోటీలోకి దిగారు. మినేషన్ ప్రక్రియ ఈ నెల 13తో ముగిసింది. జిల్లాలో 1316 మంది న్యాయవాదులు బార్ కౌన్సిల్కు ఓటు వేయనున్నారు.
రాష్ట్ర బార్కౌన్సిల్కు రెండు నామినేషన్లు


