220 | - | Sakshi
Sakshi News home page

220

Jun 20 2025 5:24 AM | Updated on Jun 20 2025 5:24 AM

220

220

యోగాంధ్రకు
ఆర్టీసీ బస్సులు

ప్రైవేటు సర్వీసులు డౌటే

ఆర్టీసీ బస్సులే కాదు ప్రైవేటు బస్సులు కూడా జిల్లాలో ఉండే అవకాశం తక్కువే. దాదాపు 20వేల మందిని జిల్లా నుంచి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేయడంతో ప్రైవేటు బస్సులు కూడా యోగా డే సేవలో తరించనున్నాయి. అదే జరిగితే ప్రైవేటు బస్సులు నడిచే రూట్లలో కూడా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఇప్పటివరకై తే వాటి విషయంలో క్లారిటీ లేదు. ఏ క్షణంలోనైనా సర్వీసులు రద్దు అయ్యే అవకాశం ఉంది. ప్రయాణికులు ముందస్తు సమాచారంతో రాకపోకలు సాగించడం మేలు.

ప్రభుత్వ ఆదేశాలతో ఆర్టీసీ యాజమాన్యం కేటాయింపు

జిల్లాలో 80 రూట్‌లలో 164 బస్సులతోనే సేవలు

నేడు,రేపు ప్రజలకు తప్పని

ప్రయాణ కష్టాలు

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:

జిల్లాలో 80 వరకు రూట్లలో 384 ఆర్టీసీ బస్సులు ప్రతి రోజూ తిరుగుతాయి. అయినప్పటికీ చాలా రూట్లలో బస్సులు దొరకని పరిస్థితి ఉంది. ప్రైవేటు బస్సులు, ఆటోలు, ఇతరత్రా వాహనాలను పట్టుకుని ప్రయాణాలు సాగిస్తుంటారు. ఉన్న 384 బస్సులే అరకొర అనుకుంటే, వాటిలో 220 బస్సులు విశాఖలో జరిగే యోగాంధ్ర కోసం తరలిస్తే జిల్లాలో ప్రయాణికుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడదే జరుగుతోంది.

ఎలాగైనా జనాన్ని తీసుకెళ్లాల్సిందే..

విశాఖలో యోగాంధ్ర పుణ్యమా అని ప్రయాణికులకు కష్టాలు తప్పవు. శుక్రవారం, శనివారం రాకపోకలకు ఇబ్బందులు పడాల్సిందే. అత్యధిక బస్సులు యోగాంధ్ర కోసం విశాఖ వెళ్లిపోతుండటంతో ఇక్కడ ప్రయాణికులు అవస్థలు పడకతప్పదు. యోగా డే కొత్తేమి కాదు. ఏటా జూన్‌ 21న చేస్తుంటారు. ఎక్కడికక్కడ యోగా డే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ చంద్రబాబు తన మార్క్‌ పబ్లిసిటీ కోసం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దగ్గర మార్కులు కొట్టేసేందుకు చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. తమకున్న బలమేంటో తెలిపేందుకు, లక్షల్లో జనాలను చూపించేందుకు చంద్రబాబు అండ్‌కో తెగ ఆరాట పడుతున్నారు. అందులో భాగంగా టార్గెట్లు ఇచ్చి జన సమీకరణ చేయిస్తున్నారు. ఎవరికెన్ని ఇబ్బందులు ఉన్నా నయానోభయానో విశాఖపట్నంకు జనాలను తీసుకురావాల్సిందేనని అధికారులకు హుకుం జారీ చేశారు. ఇంకేముంది ఉద్యోగులకు సంకటంగా మారింది. భయపెట్టో, బతిమాలో.. జనాలు తరలించేందుకు ఆపసోపాలు పడుతున్నారు.

220 ఆర్టీసీ బస్సుల తరలింపు

జిల్లా నుంచి జనాలను తరలించేందుకు అధిక సంఖ్యలో బస్సులు కేటాయించారు. మనకున్నవి 384 బస్సులైతే, వాటిలో 220 బస్సులు యోగాంధ్ర కోసం సమకూర్చారు. ఈ లెక్కన జిల్లాలో మిగతా 164 బస్సులు మాత్రమే ప్రయాణికులకు సేవలందిస్తాయి. దీన్నిబటి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రెండు రోజుల పాటు ప్రయాణికుల రాకపోకలకు ఎంత ఇబ్బంది ఉంటుందనేది, ఇప్పుడున్న 80 రూట్లలో ఎన్ని బస్సులు తిరుగుతాయో చెప్పలేని పరిస్థితి ఉంది. ప్రత్యామ్నాయం చూసుకోకపోతే ఇబ్బందులు తప్పవు. ఇప్పటికే 60 బస్సులు ఇతర జిల్లాలకు వెళ్లిపోయాయి. ఆ బస్సులు నడవాల్సిన రూట్‌లో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. శుక్రవారం, శనివారం మిగతా బస్సులు వెళ్లిపోనున్నా యి. దీంతో ప్రయాణికుల కష్టాలు రెట్టింపవుతాయి.

2201
1/1

220

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement