
‘పరిహారం ఇప్పించండి మహాప్రభో’
సంతబొమ్మాళి: మూలపేట పోర్టు నిర్మాణంతో సర్వస్వం కోల్పోయినా ఇంతవరకు తమకు ఎలాంటి పరిహారం ఇవ్వలేదని, పరిహారం ఇప్పించాలని విష్ణుచక్రం గ్రామానికి చెందిన దంపతులు గిన్ని ఈశ్వరరావు, మహాలక్ష్మి కోరుతున్నారు. గురువారం విలేకరులతో మాట్లాడారు. పీడీఎఫ్ లిస్టులో తమ పేరు ఉన్నా ఇంతవరకు పరిహారం ఇవ్వలేదన్నారు. పోర్టు పునరావాస కేంద్రంలో ఐదు సెంట్లు భూమి కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశా రు. అందరూ ఊరు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారని, తాము మాత్రమే ఊరిలో ఉండి ఏం చేయ గలమని అన్నారు. ప్రభుత్వం స్పందించి న్యా యపరంగా నష్టపరిహారం ఇప్పించాలని కోరారు.
కల్తీ పదార్థాలు
విక్రయిస్తే చర్యలు
వజ్రపుకొత్తూరు: మండలంలోని పూండి వర్తక, వ్యాపార కేంద్రంలోని కిరాణా షాపుల్లో కాలం చెల్లిన, కల్తీ పదార్థాలు విక్రయించే షాపుల ఆట కట్టిస్తామని శ్రీకాకుళం ఫుడ్ సేఫ్టీ అధికారి జి.శ్రీరాములు హెచ్చరించారు. ఆయన గురువారం పూండి కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర సూపర్ మార్కెట్, సంతోషి కిరాణా, మరి కొన్ని షాపు ల్లో తనిఖీలు చేపట్టి కల్తీ జరిగినట్లు అనుమానించి నెయ్యి, కందిపప్పు, మినప గుళ్లు శాంపిల్స్ సేకరించారు. పూండి పరిసర ప్రాంతాల వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదులు వెళ్లడంతో తని ఖీలు చేశారు. అయితే వ్యాపారులు ఫుడ్ సేఫ్టీ అధికారులపై తిరగబడి, కొంత మంది టీడీపీ నేతలను పిలిచి విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా బెదింపులకు సైతం దిగడం స్థానికంగా సంచలనం కలిగించింది. ఈ విషయమై ఫుడ్ సేఫ్టీ అధికారి శ్రీరాములు మాట్లాడుతూ పూండిలోని కిరాణా షాపుల్లో కల్తీ జరిగినట్లు అనుమానించి శాంపిల్స్ సేకరించామని, వాటిని హైదరాబాద్లోని సెంట్రల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీకి పంపించామని తెలిపారు. ఈ విషయం జిల్లా జాయింట్ కలెక్టర్ దృష్టి సైతం తీసుకెళుతున్నట్లు ఆయన తెలిపారు.
అకడమిక్ సిలబస్లపై దృష్టి
శ్రీకాకుళం రూరల్: అకడమిక్ సిలబస్లపై ఎంఈఓలు దృష్టి సారించాలని రాష్ట్ర విద్యాశాఖ కమిషన్ విజయరామరాజు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని మునసబుపేటలో గల గురుజాడ కళాక్షేత్రంలో గురువారం 38 మండలాల ఎంఈఓలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటివరకూ ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా పూర్తి చేసినందుకు ఎంఈఓలను అభినందించారు. రానున్న మూడు నెలల్లో అకడమిక్లపై దృష్టి పెట్టాలన్నారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న భాషోపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలంటూ పిసిని వసంతరావు రాష్ట్రవిద్యాశాఖ కమిషనర్ను కోరారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో తెలుగు ఉపాధ్యాయుల పోస్టులను పునరుద్ధరించాలని, మాన్యువల్ బదిలీల కౌన్సెలింగ్ చేయాలని కోరారు.

‘పరిహారం ఇప్పించండి మహాప్రభో’