నేడు జాబ్‌మేళా | - | Sakshi
Sakshi News home page

నేడు జాబ్‌మేళా

Jun 18 2025 3:35 AM | Updated on Jun 18 2025 3:35 AM

నేడు

నేడు జాబ్‌మేళా

శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో బుధవారం జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.శ్రీరాములు పేర్కొన్నారు. ఎంఎస్‌ఎన్‌ లేబొరేటరీస్‌లో అసిస్టెంట్‌ కెమిస్ట్‌ పోస్టుల ఉ ద్యోగాలకు ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. 2020 నుంచి 2025 మధ్యలో డిగ్రీ ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరూ అర్హులేనని తెలిపారు. జాబ్‌మేళాకు హాజరయ్యే అభ్యర్థులు తమ బయోడేటాతోపాటు ఆధార్‌కార్డు, సర్టిఫికెట్లు, రెండు పాస్‌ ఫొటోలతో హాజరై జేకేసీ కోఆర్డినేటర్‌ వై.మణికుమార్‌ను సంప్రదించాలని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ శ్రీరాములు సూచించారు.

అగ్ని ప్రమాదం దురదృష్టకరం

ిహరమండలం: ఆధ్యాత్మిక కూర్మ గ్రామంలో అగ్ని ప్రమాద సంఘటన దురదృష్టకరమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యు రాలు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డిశాంతి అన్నారు. మంగళవారం కూర్మ గ్రామాన్ని సందర్శించి హరేకృష్ణ ప్రార్ధన పర్ణశాలను పరిశీలించారు. కృష్ణ భక్తులతో మాట్లాడి ప్ర మాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నా రు. ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించాలని కోరారు. కార్యక్రమంలో ఎల్‌ఎన్‌పేట ఎంపీపీ రెడ్డి జ్యోతిలక్ష్మి, వైఎస్సార్‌ సీపీ నాయకులు లుకలాపు ప్రసాద్‌, శ్రీనివాసరావు, నక్క ఆనందరావు, గోళ్ల నాగేశ్వరరావు, చింతాడ సూర్యనారాయణ, ఈగల చిన్నారావు, బి.గోవిందరావు పాల్గొన్నారు.

‘జీడి పరిశ్రమలు వెంటనే తెరిపించాలి’

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): అక్రమంగా బంద్‌ చేసిన జీడి పరిశ్రమల్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తెరిపించాలని లేకుంటే జూన్‌ 21న పలాసలో కార్మికులతో మహాధర్నా చేస్తామని సీఐ టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, ఉపాధ్యక్షులు ఎం.ఆదినారాయణమూర్తి, కె.సూరయ్య హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం శ్రీకాకుళం సీఐటీయూ జిల్లా కార్యాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పలాస పారిశ్రామిక ప్రాంతంలో జీడి పరిశ్రమల యాజమాన్యాలన్నీ పరిశ్రమల బంద్‌ ప్రకటించడం చట్టవ్యతిరేకమైన చర్య అని అన్నారు. పరిశ్రమలు బంద్‌ చేసి రెండు వారాలు పూర్తయినా నేటికీ తెరవకపోవడంతో సుమారు 20వేల మంది కార్మికులు ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మూసివేసిన పరిశ్రమలు వెంటనే తెరిపించాలని, బంద్‌ కాలానికి కార్మికులందరికీ వేతనాలు చెల్లించాలని, పీఎఫ్‌, ఈఎస్‌ఐ కట్టాలని వారు యాజమాన్యాలను డిమాండ్‌ చేశారు.

నేడు జాబ్‌మేళా 1
1/1

నేడు జాబ్‌మేళా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement