
మిస్టర్ ఆంధ్రా బాడీబిల్డింగ్ పోటీలకు ఎంపిక
శ్రీకాకుళం న్యూకాలనీ: మిస్టర్ ఆంధ్రా బాడీబిల్డింగ్ చాంపియన్షిప్ పోటీలకు శ్రీకాకుళం జిల్లా నుంచి పది మంది బాడీబిల్డర్లను ఎంపికచేశారు. స్థానికంగా జరిగిన జిల్లాస్థాయి ఎంపికల్లో రాణించిన బాడీబిల్డర్లు ఈ నెల 22న నెల్లూరులో జరిగే రాష్ట్రపోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు మంగళవారం పేర్కొన్నారు. కార్యక్రమంలోస్టార్ బాడీబిల్డర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వి.విజయ్కుమార్, ది ఆంధ్రా బాడీబిల్డర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కె.గౌరీశంకర్, వి.రమేష్ తదితరులు పాల్గొన్నారు.