మాటల్లో డాబు.. పైకమేదీ బాబూ! | - | Sakshi
Sakshi News home page

మాటల్లో డాబు.. పైకమేదీ బాబూ!

Jun 18 2025 3:35 AM | Updated on Jun 18 2025 3:35 AM

మాటల్

మాటల్లో డాబు.. పైకమేదీ బాబూ!

15వ ఆర్థిక సంఘ నిధులు జమ చేయని ప్రభుత్వం

జిల్లాకు రెండో విడతగా రూ.39 కోట్లు కేటాయించిన కేంద్రం

పంచాయతీలకు డబ్బులు చేరని వైనం

నిధుల కోసం ఎదురుచూస్తున్న

పంచాయతీలు

నిధులు దారి మళ్లించారు

రాష్ట్రంలో కూటమి పాలనలో ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. గ్రామ పంచాయతీలకు కేటాయించిన 15వ ఆర్థిక సంఘ రెండో విడత ని ధులను కూడా దారి మళ్లించేసి తల్లికి వందనం పథకానికి వాడేశారు. గ్రామ పంచాయతీలకు నిధులివ్వకపోవడంతో పల్లెల్లో నిత్యం పారిశుద్ధ్య పనులను కూడా చేయలేకపోతున్నాం. కేంద్రం ఇస్తున్న నిధులను కూడా పంచాయతీలకు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుండడం దారుణం.

– మార్పు పృథ్వీరాజ్‌, సర్పంచ్‌, గార

అరసవల్లి: పంచాయతీలు నిధుల కోసం ఎదురుచూస్తున్నాయి. రాష్ట్రం ఊరికి డబ్బులివ్వడం లేదు సరి కదా..కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 15వ ఆర్థిక సంఘ నిధులు సైతం పంచాయతీలకు చేరకుండా ‘మళ్లింపు’ మంత్రం పఠిస్తోంది. కూట మి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామ పంచాయతీల దశ దిశ మార్చేస్తామని ఓ పక్క చంద్రబాబు, మరో పక్క పవన్‌ కల్యాణ్‌ గుప్పించిన ప్రకటనలన్నీ గాలి మాటలేనని తేలిపోయింది. పల్లె ఖజానాకు నిధులు చేరకపోవడంతో ఊళ్లలో పారిశుద్ధ్యం క్షీణిస్తోంది.

కూటమి నేతలు కుట్ర రాజకీయం

జిల్లాలో ప్రస్తుతం సర్పంచ్‌ల బాధ వర్ణణాతీతంగా మారింది. అత్యధికంగా వైఎస్సార్‌ సీపీకి మద్దతిచ్చిన సర్పంచ్‌లు జిల్లాలో ఉండడంతో.. ఆయా పంచాయతీల్లో అభివృద్ధికి ఏమాత్రం ఆస్కారమివ్వకుండా కూటమి నేతలు కుట్ర రాజకీయాలకు దిగుతున్నారు. ఈ క్రమంలో కేంద్రమిచ్చి, నేరుగా జమ కావాల్సిన నిధులను కూ డా దారి మళ్లించేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ‘తల్లికి వందనం’ పేరిట అమలు చేసిన పథకానికి ఇవే నిధులు మళ్లించి జనాలకు అందజేశారనే ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా వెల్లువెత్తుతున్నాయి. ‘తల్లికి వందనం’ పథకానికి రాష్ట్రంలో గ్రామ సర్పంచ్‌ల పిల్లలు అనర్హులని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని అమ లు చేయడం మరింత దురదృష్టకరమనే విమర్శలు వినిపిస్తున్నాయి.

జిల్లాకు అందని రూ.39 కోట్లు నిధులు

జిల్లాలో మొత్తం 30 మండలాల్లో 912 గ్రామ పంచాయతీలుంటే..ఇందులో ఎన్నికలు నిర్వహించని 16 పంచాయతీలు మినహా మిగిలిన 896 పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంఘ నిధుల కేటాయింపులు జరగాల్సి ఉంది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘ నిధులు తొలివిడతగా రూ.38,66,19,415 వరకు జమ చేశారు. రెండో విడతగా గత రెండు నెలల కిందట కేంద్ర ప్రభుత్వం నుంచి సుమారు రూ.39.16 కోట్ల నిధులు జిల్లాకు కేటాయింపు చేశారు. అయితే జిల్లా లో 896 పంచాయతీలకు ఒక్క రూపాయి కూడా జమ కాలేదు. దీనిపై గ్రామ సర్పంచ్‌లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిధుల మళ్లింపుతో పల్లెలు అవస్థలు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంపద సృష్టిస్తా అంటే.. ఇలా కేంద్ర నిధులను మళ్లింపు చేసి రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు వర్తింపజేయడమా అని ప్రశ్నిస్తున్నారు.

పల్లెకు సుస్తీ..

జిల్లాలో దాదాపుగా ఉన్న మేజర్‌ గ్రామ పంచాయతీలతో పాటు సాధారణ పంచాయతీల్లోనూ అపరి శుభ్ర వాతావరణమే కనిపిస్తోంది. పల్లెల్లో ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాలతో ఎక్కడికక్కడ మురుగునీరు నిల్వలుండిపోయాయి. కాలువల్లో పూడిక తీత పనులు పెద్దగా జరగకపోవడంతో చెత్త చెదారాలతో పల్లె రహదారులు నిండిపోయాయి. టెక్కలి డివిజన్‌లో పంచాయతీల పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నాయి. ఇక జిల్లా కేంద్రానికి సమీపంలోని శ్రీకాకుళం రూరల్‌, గార, ఎచ్చెర్ల, లావేరు తదితర మండలాల్లోని పంచాయతీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో అంటు వ్యాధులు ప్రబలడంతో పా టు స్థానికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. నిధుల లేమితో పంచాయతీల్లో రోజూ జరగాల్సిన పరిశుభ్రత పనులు కూడా జరగడం లేదు. దీనిపై స్థానికుల నుంచి ఫిర్యాదులు వస్తున్నా అధికారులు మిన్నకుండిపోతున్నారు.

ఎక్కడా నిధుల లేమి ప్రస్తావన రాకుండా చూడాలని కూటమి పాలకులు హెచ్చరికలు జారీ చేస్తున్న క్రమంలో అధికారులు నోరు మెదపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

మాటల్లో డాబు.. పైకమేదీ బాబూ! 1
1/2

మాటల్లో డాబు.. పైకమేదీ బాబూ!

మాటల్లో డాబు.. పైకమేదీ బాబూ! 2
2/2

మాటల్లో డాబు.. పైకమేదీ బాబూ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement