నేటి నుంచి ఉచిత శిక్షణలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఉచిత శిక్షణలు

Apr 2 2025 12:40 AM | Updated on Apr 3 2025 1:28 AM

నేటి నుంచి ఉచిత శిక్షణలు

నేటి నుంచి ఉచిత శిక్షణలు

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జిల్లాలో పలువురు నిరుద్యోగ యువతకు ఉచిత వృత్తి విద్య కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్టు డీఆర్‌డీఏ పీడీ కిరణ్‌ కుమార్‌ తెలిపారు. ఈనెల 2వ తేదీ నుంచి ఏడో తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నాలుగు శిక్షణ కేంద్రాల్లో ఈ ఎంపికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

● సీడాప్‌–డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ఎచ్చెర్ల టీటీడీసీలో స్వీవింగ్‌ మిషన్‌ ఆపరేటర్‌ పోస్టుకు మూడు నెలల పాటు 60 మందికి శిక్షణ ఇవ్వనున్నారని, కనీస విద్యార్హత పదోతరగతి ఉండాలని తెలిపారు.

● శ్రీసాయివెంకటనారాయణ సొసైటీ వైటీసీ మందస (రెంటికోట) లో సోలార్‌ ఎల్‌ఈడీ టెక్నీ షియన్‌, స్మార్ట్‌ఫోన్‌ టెక్నీషియన్‌ కోర్సుల్లో మూడు నెలల పాటు 140 మందికి శిక్షణ ఇవ్వనున్నారని, దీనికి ఇంటర్‌లో సైన్సు గ్రూప్‌ పాస్‌ అయ్యి ఉండాలని తెలిపారు.

● శ్రీలక్ష్మీదీపా మెమోరియల్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ, సింగనవలన సీతంపేట రోడ్‌లో రెస్టారెంట్‌ కెప్టెన్‌ కోర్సులకు 3 నెలలు శిక్షణ ఉంటుందని, 140 మందిని తీసుకుంటామన్నారు. ఇందుకు గాను ఇంటర్‌ లేదా ఐటీఐ చదివి ఉండాలని తెలిపారు.

● శ్రీకై ట్స్‌ స్కిల్స్‌ పీవీటీ లిమిటెడ్‌ వారి ఆధ్వర్యంలో ఎచ్చెర్లలోని మహిళా ప్రాంగణం వద్ద గల ఐటీఐ ప్రాంగణం పక్కన ఫుడ్‌ అండ్‌ బెవరేజ్‌, గెస్టు సర్వీసులలో 3 నెలలు శిక్షణ ఉంటుందని, 90 మందిని తీసుకుంటారని, దీనికి పది, ఐటీఐ కోర్సులు చదివి ఉండాలని తెలిపారు.

ఆసక్తి గల వారు రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డు, జాబ్‌కార్డు రెండు ఫొటోలు, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు, బయోడేటాతో హాజరుకావాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement