పుట్టపర్తి: రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, కొత్తచెరువు మండలం బండ్లపల్లి జెడ్పీహెచ్ఎస్లో తెలుగు పండితుడిగా పనిచేస్తున్న కవి మాణిక్యం ఇషాక్కు సింగపూర్లో ఘన సన్మానం లభించింది. సింగపూర్ విద్య అధ్యయనంపై ఈ నెల 2న పలువురు ఉపాధ్యాయులను రాష్ట్ర ప్రభుత్వం అక్కడకు పంపిన విషయం తెలిసిందే. ఈ అధ్యయనం శుక్రవారంతో ముగిసింది. ముగింపు రోజున సింగపూర్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఎన్ఐఈ)లో జరిగిన కార్యక్రమంలో తాను రాసిన ‘మాణిక్య శతకం’ పుస్తకాన్ని ప్రముఖుల చేతుల మీదుగా ఆయన ఆవిష్కరింపజేశారు. ఇషాక్ రాసిన పాటలను వీడియో రూపంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు ఆయనతో పాటు ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ వెంకటకృష్ణారెడ్డిని నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. రాష్ట్రం నుంచి తరలివెళ్లిన 37 మంది ఉపాధ్యాయులతో పాటు ఎస్సీఈఆర్టీ అధికారులు వెంకటరమణ, మహేశ్వర్రెడ్డి, జిల్లా రచయితల సంఘం అద్యక్షుడు జాబిలి చాంద్బాషా తదితరులు పాల్గొన్నారు.


