ఎకై ్సజ్‌ సీఐ మహేష్‌కు రాష్ట్రస్థాయి పురస్కారం | - | Sakshi
Sakshi News home page

ఎకై ్సజ్‌ సీఐ మహేష్‌కు రాష్ట్రస్థాయి పురస్కారం

Jan 27 2026 7:35 AM | Updated on Jan 27 2026 7:35 AM

ఎకై ్సజ్‌  సీఐ మహేష్‌కు రాష్ట్రస్థాయి పురస్కారం

ఎకై ్సజ్‌ సీఐ మహేష్‌కు రాష్ట్రస్థాయి పురస్కారం

రాయదుర్గం: విధి నిర్వహణలో ప్రతిభ చూపిన రాయదుర్గం ఎకై ్సజ్‌ సీఐ మహేష్‌కుమార్‌ను రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డు వరించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం విజయవాడలో ఎకై ్సజ్‌ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ రాహుల్‌దేవ్‌శర్మ చేతుల మీదుగా ఆయన ప్రశంసా పత్రం అందుకున్నారు. జిల్లాస్థాయిలోనూ ఆయన అవార్డుకు ఎంపిక కావడం గమనార్హం. ఈ సందర్భంగా సీఐ మహేష్‌కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఒకేసారి అవార్డులు దక్కడం గర్వకారణమన్నారు. మరింత బాధ్యతగా విధులు నిర్వహిస్తానని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement