లేపాక్షి హుండీ కానుకల ఆదాయం రూ.8.16 లక్షలు | - | Sakshi
Sakshi News home page

లేపాక్షి హుండీ కానుకల ఆదాయం రూ.8.16 లక్షలు

Jun 20 2025 6:43 AM | Updated on Jun 20 2025 6:43 AM

లేపాక

లేపాక్షి హుండీ కానుకల ఆదాయం రూ.8.16 లక్షలు

లేపాక్షి: లేపాక్షి వీరభద్రస్వామి దేవాలయంలో గురువారం ఆలయ కమిటీ చైర్మన్‌ కరణం రమానందన్‌ పర్యవేక్షణలో ఈఓ నరసింహమూర్తి ఆధ్వర్యంలో హుండీ కానుకలను లెక్కించారు. హుండీల ద్వారా రూ.8,16,341 ఆదాయం వచ్చిందని చైర్మన్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవదాయశాఖ ఇన్‌స్పెక్టర్‌ నరసింహరాజు, గ్రామ పెద్దలు, భక్తులు, అర్చకులు పాల్గొన్నారు.

సమయ పాలన పాటించాలి

పెనుకొండ రూరల్‌: సమయ పాలన కచ్చితంగా పాటించాలని జిల్లా వైద్యాధికారిణి ఫైరోజాబేగం వైద్య సిబ్బందిని ఆదేశించారు. మండల పరిధిలోని గుట్టూరు ప్రభుత్వాస్పత్రిని ఆమె ఆకస్మికంగా గురువారం తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించారు. ఓపీ, వార్డులో ఉన్న రోగులతో వైద్య సదుపాయాలు గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఫార్మా గదిని పరిశీలించారు. పంపిణీ చేసిన, నిలువ ఉన్న మందుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఆస్పత్రి ఆవరణలోని పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఫైరోజా బేగం మాట్లాడుతూ.. ఆస్పత్రి పరిసరాలను ఎప్పటికపకప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వైద్యులు నాగరాజు నాయక్‌, శ్రావణి, సిబ్బంది హాజరయ్యారు.

ప్రభుత్వ బడుల్లో ప్రవేశాల పెంపునకు కృషి

పుట్టపర్తి: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల చేరికల సంఖ్య పెంచేందుకు కృషి చేస్తున్నట్లు డీఈఓ కృష్ణప్ప తెలిపారు. ఆయన గురువారం పుట్టపర్తి ఎమ్మార్సీలో రికార్డులను తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు విజయవంతంగా ముగించామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏ పాఠశాలలోనూ ఉపాధ్యాయుల కొరత లేకుండా సర్దుబాటు చేశామని పేర్కొన్నారు. ఎక్కడైనా అవసరముంటే ఎంటీఎస్‌ ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తామని వివరించారు. ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి ఉత్తీర్ణత శాతాన్ని పెంచే విధంగా ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎంఈఓలు ఖాదర్‌ వలిబాషా, ప్రసాద్‌, ఉపాధ్యాయుడు ప్రకాష్‌రెడ్డి, ఎమ్మార్సీ సిబ్బంది నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

అంబేడ్కర్‌ గురుకులాల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తులు

అనంతపురం ఎడ్యుకేషన్‌: శ్రీ సత్యసాయి జిల్లాలోని అంబేడ్కర్‌ గురుకుల పాఠశాలల్లో 6–9 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయనున్నట్లు జిల్లా సమన్వయ అధికారి కె.జయలక్ష్మీ తెలిపారు. జిల్లా కార్యాలయం లేదా గురుకుల పాఠశాలల్లో ఈనెల 23లోపు దరఖాస్తులు అందజేయాలన్నారు. అనంత పురం జిల్లాలో ఖాళీలు లేవన్నారు. బాలికలకు హిందూపురం బాలికల పాఠశాల, బాలురకు హిందూపురం బాలుర పాఠశాలల్లో పరీక్షలు ఉంటాయన్నారు.

ఖాళీలు రోస్టర్‌ వారీగా ఇలా...

6వ తరగతిలో..కాళసముద్రం పాఠశాలలో బీసీ–1, మలుగూరు ఎస్సీ (గ్రూప్‌–3)–2, నల్లమాడలో ఎస్సీ (గ్రూప్‌–3)–2, ఎస్టీ–2, ఓసీ–1, అమరాపురంలో ఎస్సీ (గ్రూప్‌–3)–1, రొళ్లలో ఎస్సీ (గ్రూప్‌–3)–2, ఓసీ–1 ఖాళీలున్నాయి. అలాగే 7వ తరగతిలో మలుగూరులో ఎస్సీ (గ్రూప్‌–3)–1, ఎస్టీ–1, అమరాపురంలో ఎస్సీ (గ్రూప్‌–3)–1, హిందూపురం బాలకల పాఠశాలలో ఎస్సీ (గ్రూప్‌–3)–3, ఎస్టీ–1, బీసీ–1, రొళ్ల పాఠశాలలో ఎస్టీ–1 ఖాళీలున్నాయి. 9వ తరగతిలో హిందూపురం బాలికల పాఠశాలలో ఎస్సీ (గ్రూప్‌–3)–1 ఖాళీ ఉందని జయలక్ష్మీ వెల్లడించారు.

లేపాక్షి హుండీ కానుకల ఆదాయం రూ.8.16 లక్షలు 1
1/2

లేపాక్షి హుండీ కానుకల ఆదాయం రూ.8.16 లక్షలు

లేపాక్షి హుండీ కానుకల ఆదాయం రూ.8.16 లక్షలు 2
2/2

లేపాక్షి హుండీ కానుకల ఆదాయం రూ.8.16 లక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement